తెలుగులో ధనుష్ కన్నా కార్తీదే హడావుడే ఎక్కువ....!
ధనుష్ టాలీవుడ్లో గుర్తింపు పొందడానికి చాలా సమయం తీసుకున్నాడు. కానీ కార్తి మాత్రం తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను తొందరగా టార్గెట్ చేశాడు. అందులోనూ ఆయన ఇప్పుడు వరస విజయాల ఊపులో ఉన్నాడు. 'ఊపిరి' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. మరి ఊపులో ఉన్న కార్తి నటించిన 'కాష్మోరా' చిత్రం రేపు విడుదల కానుంది.ఈ చిత్రాన్ని తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ధనుష్ విషయానికి వస్తే ఆయన 'రఘువరన్ బిటెక్'తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సాధారణంగా ధనుష్కు తమిళంలో ఓ విజయం తర్వాత వరుస ఫ్లాప్లు ఇవ్వడం సాధారణం. అదే కోవలో విఐపి చిత్రం తర్వాత ధనుష్ నటించిన ఏ చిత్రం కూడా తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కార్తీ 'కాష్మోరా'కు ధీటుగా ఆయన నటించిన పొలిటికల్ సెటైర్ ఫిలిం 'ధర్మయోగి' ( కోడి) చిత్రం కూడా విడుదలకు రెడీ అయింది. తమిళం సంగతేమో గానీ తెలుగులో మాత్రం 'ధర్మయోగి' కంటే 'కాష్మోరా'నే ఎక్కువ క్రేజ్ను సిద్దం చేసుకొని విడుదలకు ముస్తాబవుతోంది.