Thu Mar 26 2026 04:28:03 GMT+0530 (India Standard Time)
టచ్ చేసి చూడు మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే

రవితేజ హీరోగా రాశి ఖన్నా, సీరత్ కపూర్ లు హీరోయిన్స్ గా నటించిన టచ్ చేసి చూడు సినిమా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి షోకే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. రవితేజ ఎనర్జీ, రవితేజ క్రేజ్ కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ తేలేకపోయింది. మరి రవితేజ కెరీర్ లోనే మరి ఘోరమైన కలెక్షన్స్ రాబట్టినట్టుగా తెలుస్తుంది. టచ్ చేసి చూడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున ఎంత సంపాదించిందో మీరు చూడండి.
నైజామ్: 1.56 కోట్లు
సీడెడ్: 47 లక్షలు
నెల్లూరు: 20 లక్షలు
గుంటూరు: 47 లక్షలు
కృష్ణా 23 లక్షలు
వెస్ట్ గోదావరి: 30 లక్షలు
ఈస్ట్ గోదావరి: 45 లక్షలు
ఉత్తరాంధ్ర: 48 లక్షలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున ఈ సినిమా 4.16 కోట్ల షేర్ ను రాబట్టింది.
Next Story

