Tue Jan 20 2026 03:15:48 GMT+0000 (Coordinated Universal Time)
పరుగులో పుల్లయ్య పేరు
ఖమ్మంలో ఇంటెలిజెన్స్ ఎస్సైగా పనిచేస్తున్న సిరిపురపు పుల్లయ్య యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఖమ్మంలో ఇంటెలిజెన్స్ ఎస్సైగా పనిచేస్తున్న సిరిపురపు పుల్లయ్య యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. త్వరలో ఉద్యోగ విరమణ చేయబోతున్న ఆయన యువతకు దీటుగా 2 గంటల 15 నిమిషాల్లో 21 కిలో మీటర్ల హాఫ్ మారథాన్ పూర్తిచేశా రు. ఆదివారం ఆయన స్వగ్రామమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కామేపల్లి మండలం ముచ్చర్లలో ఉదయం 6.30కు ఈ మారథాన్ ప్రారంభించి, 8.45కు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో పూర్తిచేశారు. 40 ఏళ్లపాటు పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన.. తన 53వ ఏట నుంచి మారథాన్లలో పాల్గొనడం ప్రారంభించారు. 150 పతకాలకు పైగా సాధించారు.
Next Story

