సమోసా, జిలేబీలపై లేబుల్స్.. నిజం లేదంటున్న ప్రభుత్వం
సమోసా, జిలేబీ లాంటి ఆహార పదార్థాల్లోని చక్కెర, నూనె శాతాలను తెలిపే వివరాలను వినియోగదారులకు తెలిసేలా అమ్మకందారుల ఏర్పాట్లు

సమోసా, జిలేబీ లాంటి ఆహార పదార్థాల్లోని చక్కెర, నూనె శాతాలను తెలిపే వివరాలను వినియోగదారులకు తెలిసేలా అమ్మకందారుల ఏర్పాట్లు చేయాలంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సిగరెట్ పెట్టెలపై ఉన్నట్లుగా హెచ్చరికలు ఉంచాలని కేంద్రం నిర్ణయించిందనడంలో వాస్తవం లేదని తేలింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సాధారణ ఆరోగ్య సలహా మాత్రమే ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. బహిరంగంగా విక్రయించే ఆహార ఉత్పత్తుల్లోని చక్కెర, నూనె శాతాలను పేర్కొంటూ హెచ్చరిక బోర్డులు పెట్టాలని నిర్దేశించలేదని, అంతేకాకుండా ప్రత్యేకంగా ఆ వంటకాల పేర్లను ప్రస్తావించలేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజలు మెరుగైన ఆహారాన్ని జీవనశైలిని ప్రోత్సహించేందుకు కేంద్రం సాధారణ ఆరోగ్య సలహా ఇచ్చింది తప్ప ఏ ఆహార పదార్థాలను లక్ష్యంగా చేసుకోలేదని క్లారిటీ ఇచ్చింది.

