Fri Jan 30 2026 22:20:23 GMT+0000 (Coordinated Universal Time)
175 మందితో వెళుతున్న విమానం.. ఢీకొట్టిన రాబంధు

చిన్న పక్షి.. విమానానికి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఇండిగో విమానానికి అలాంటి ప్రమాదమే తప్పింది. దాదాపు 175 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇండిగో ఎయిర్బస్ 320 విమానాన్ని ఓ రాబందు ఢీ కొట్టింది. దీంతో ఆ విమానాన్ని రాంచీలోని బిస్రా ముండా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని ఓ అధికారి తెలిపారు.
విమానం రాంచీకి దాదాపు 10 నుంచి 12 నాటికల్ మైళ్ల దూరంలో 3-4వేల అడుగుల ఎత్తులో ఉండగా పక్షి ఢీకొంది. దీంతో పైలెట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ప్రయాణికులతో సహా సిబ్బందికి ఎలాంటి హాని కలుగలేదు. విమానం దెబ్బతిన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు
Next Story

