తూర్పు పసిఫిక్లో పడవపై అమెరికా దాడి… ఆరుగురు మృతి
తూర్పు పసిఫిక్ సముద్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్నట్లు అనుమానించిన ఓ పడవపై అమెరికా సైన్యం ఆదివారం దాడి చేసింది.

తూర్పు పసిఫిక్ సముద్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్నట్లు అనుమానించిన ఓ పడవపై అమెరికా సైన్యం ఆదివారం దాడి చేసింది. ఈ దాడిలో ఆరుగురు మృతిచెందినట్లు సైన్యం తెలిపింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చిన్న పడవల్లో ప్రయాణిస్తున్నవారిని “నార్కో టెర్రరిస్టులు”గా పేర్కొంటూ సెప్టెంబర్ ప్రారంభం నుంచి దాడులు చేస్తోంది. ఆదివారం జరిగిన తాజా దాడితో మొత్తం మృతుల సంఖ్య కనీసం 157కు చేరిందని సమాచారం. తూర్పు పసిఫిక్ సముద్రం, కరేబియన్ సముద్ర ప్రాంతాల్లో ఇప్పటివరకు 40కుపైగా దాడులు జరిగాయని అమెరికా సదర్న్ కమాండ్ తెలిపింది. స్మగ్లింగ్కు ప్రసిద్ధి చెందిన మార్గాల్లో ప్రయాణిస్తున్న అనుమానిత మాదకద్రవ్య రవాణాదారులపై లక్ష్యంగా దాడులు చేశామని పేర్కొంది. అయితే ఆ పడవలో నిజంగా మాదకద్రవ్యాలు ఉన్నాయనే ఆధారాలు వెల్లడించలేదు. నీటిలో తేలుతున్న చిన్న పడవ పేలిపోతున్న వీడియోను ‘ఎక్స్’లో విడుదల చేసింది.

