Israel -Iran War : ఇరాన్పై ట్రంప్ తీవ్ర హెచ్చరికలు…కాల్పుల విరమణకు ఇరాన్ ససేమిరా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఇరాన్పై మరింత కఠిన హెచ్చరికలు జారీ చేశారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఇరాన్పై మరింత కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఒప్పందానికి గడువు సమీపిస్తుండగా, ఇరాన్లోని అన్ని విద్యుత్ కేంద్రాలు, వంతెనలను లక్ష్యంగా తీసుకుంటామని తెలిపారు. టెహ్రాన్ 45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించి, యుద్ధానికి శాశ్వత ముగింపు కావాలని ప్రకటించింది. “మొత్తం దేశాన్ని ఒక్క రాత్రిలో నేలమట్టం చేయగలం. ఆ రాత్రి రేపే కావచ్చు” అని ట్రంప్ అన్నారు. మంగళవారం రాత్రి 8 గంటల గడువు తుదిగా ఉంటుందని, ఇప్పటికే చాలాసార్లు గడువు పెంచినట్టు చెప్పారు.ప్రపంచ రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని అన్ని నౌకాయానానికి తెరవాలని అమెరికా ఇరాన్కు తెలిపింది. లేదంటే విద్యుత్ కేంద్రాలు, వంతెనలు ధ్వంసమవుతాయని హెచ్చరించింది. దీనిపై యుద్ధ నేరాల ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇక ఇజ్రాయిల్ కూడా ఒత్తిడి పెంచింది. ఒక ప్రధాన పెట్రోరసాయన కర్మాగారంపై దాడి చేసి, విప్లవ గార్డు గూఢచారి విభాగాధిపతిని హతమార్చింది.

