Iran - Israel War : ట్రంప్ హెచ్చరికలు.. లైట్ తీసుకుంటున్నఇరాన్.. కొనసాగుతున్న దాడులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఇరాన్కు గట్టి హెచ్చరిక జారీ చేశారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఇరాన్కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. యుద్ధం ముగిసే ఒప్పందం త్వరలో కుదరకపోతే, ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, చమురు బావులు, తాగునీరు సరఫరా చేసే ఉప్పునీరు శుద్ధి కేంద్రాలు వంటి కీలక మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేస్తామని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇదే సమయంలో ఇరాన్ కూడా ప్రతిదాడులు కొనసాగించింది. కువైట్లోని ఒక కీలక విద్యుత్, నీటి శుద్ధి కేంద్రాన్ని దాడి చేసింది. ఇజ్రాయెల్లోని ఒక చమురు శుద్ధి కేంద్రం లక్ష్యంగా దాడి జరిగింది. దుబాయ్ సముద్ర జలాల్లో కువైట్కు చెందిన చమురు ట్యాంకర్ను డ్రోన్ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. మంగళవారం తెల్లవారుజామున మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు దుబాయ్ మీడియా కార్యాలయం తెలిపింది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్పై మరో దాడులను ప్రారంభించాయి. యుద్ధం ఎటువంటి ముగింపు సంకేతాలు లేకుండా కొనసాగుతోంది.

