Fri Dec 05 2025 23:13:43 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీలంక టు తమిళనాడు... సముద్రమార్గంలో?
శ్రీలంకలో తలెత్తిన ఆహార సంక్షోభంతో అక్కడి తమిళులు భారత్ కు తరలి వస్తున్నారు

శ్రీలంకలో తలెత్తిన ఆహార సంక్షోభంతో అక్కడి తమిళులు భారత్ కు తరలి వస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీలంకలో ఆహార సంక్షోభం నెలకొంది. ఆర్థిక సంక్షోభం కూడా తలెత్తింది. నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటాయి. సామాన్యులు శ్రీలంకలో బతకలేని పరిస్థిితి నెలకొంది. విదేశీ మారక నిల్వలు కూడా అడుగంటడంతో ఆర్థిక ఎమెర్జెన్సీని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో శ్రీలంకలో ఉన్న తమిళులు అక్కడ ఉండలేక భారత్ బాట పట్టారు.
అరెస్ట్ చేసి.....
సముద్ర మార్గం ద్వారా రామేశ్వరం, ధనుష్కోటి ప్రాంతాలకు చేరుకుంటున్నారు. నిత్యం వందల మంది తమిళులు శ్రీలంక నుంచి వస్తుండటంతో వారిని నిలువరించడం కష్టసాధ్యమయింది. అయితే వచ్చిన వారిని వచ్చినట్లు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. వారిని రామేశ్వరం శరణార్థుల నిలయంలో ఆశ్రయం కల్పిస్తున్నారు.
Next Story

