Tue Jul 08 2025 18:39:09 GMT+0000 (Coordinated Universal Time)
అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా బృందం
విజయవంతంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి శుభాంశు శుక్లా బృందం అడుగు పెట్టింది.

విజయవంతంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి శుభాంశు శుక్లా బృందం అడుగు పెట్టింది. ఇరవై ఎనిమిది గంటల పాటు ప్రయాణించిన శుభాంశు శుక్లా బృందం ఐఎస్ఎస్ లో కాలుమోపింద.ి విజయవంతంగా ఐఎస్ఎస్ తో వ్యోమనౌక అనుసంధానం జరిగిపోయింది. దీంతో భారత్ తొలిసారిగా అంతరిక్షంలోకి అడుగు పెట్టి చరిత్ర సృష్టించినట్లయింది.
పథ్నాలుగు రోజులు పాటు...
యాక్సియం-4 మిషన్ను సంయుక్తంగా చేపట్టిన నాసా,ఇస్రోలు ఐఎస్ఎస్ లో కీలక ప్రయోగాలు చేయనున్నారు. ఈ బృందానికి శుభాంశు శుక్లా నేతృత్వం వహిస్తారు. ఐఎస్ఎస్ లో శుభాంశు బృందం కీలక ప్రయోగాలు చేయనున్నారు. మిషన్లో శుభాంశు శుక్లా సహా నలుగురు వ్యోమగాములున్నారు. మొత్తం పథ్నాలుగు రోజుల పాటు శుభాంశు బృందం స్పేస్ లో ఉండనుంది. అరవై రకాల ప్రయోగాలు చేయనుంది.
Next Story