Wed May 21 2025 03:09:25 GMT+0000 (Coordinated Universal Time)
operation sidoor : మాస్టర్ మైండ్ మసూద్ అజార్ బతికే ఉన్నాడట.. చచ్చిపోయింది మాత్రం?
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న జైషే ఎ మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ బతికే ఉన్నాడు

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న జైషే ఎ మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ బతికే ఉన్నాడు. భారత్ జరిపిన ఆపరేషన్ సింధూరలో భాగంగా మసూద్ అజర్ బతికే ఉన్నాడని, అతని కుటుంబ సభ్యులలో ఎక్కువ మంది చనిపోయారని వార్తలు వస్తున్నాయి. జైషే ఎ మహ్మద్ హెడ్ క్వార్టర్ బహవల్ పూర్ లోని జైషే మహ్మద్ కార్యకలాపాలను నడిపించాడు. ఇక్కడ నుంచే ఉగ్రవాదుల దాడులకు కుట్ర జరగడంతో పాటు ఎంతో మంది ఉగ్రవాదులకు శిక్షణ శిబిరంగా మారిందని తెలిసి భారత సైన్యం దానిని నేలమట్టం చేసింది. భారత జరిపిన దాడిలో జైషే ఏ మహ్మద్ కు కోలుకోలేని దెబ్బతగిలింది. ఈ సంస్థ తో పాటు లష్కరే తోయిబాను కూడా భారత సైన్యం వదిలిపెట్టలేదు.
పాక్ రక్షణలోనే...
మసూద్ అజార్ ను పాక్ ప్రభుత్వంతో పాటు పాకిస్తాన్ సైన్యం కూడా రక్షిస్తుంటుంది. అయితే భారత్ దాడులు జరిపిన సమయంలో మసూద్ అజార్ అక్కడ లేడని తెలిసింది. అతను రావల్పిండికి ఇక్కడకు మధ్య తరచూ ట్రావెల్ చేస్తుంటారని చెబుతున్నారు. ఆయనకు పూర్తి రక్షణగా పాక్ సైన్యం కాపలా ఉంటుందని కూడా చెబుతున్నారు. బహవల్ పూర్ లో భారత్ ఆపరేషన్ సింధూర నిర్వహించినప్పుడు ముప్ఫయి మంది ఉగ్రవాదులు హతమయ్యారని చెబుతున్నారు. అందులో ఎక్కువ మంది మసూద్ కుటుంబ సభ్యులతో పాటు ఉగ్రవాదులు కూడా ఉన్నారని తెలిసింది. జైషే ఎ మహ్మద్ ప్రధాన కార్యాలయంతో పాటు అక్కడ మదర్సా కూడా నిర్వహిస్తున్నారు.
భారత్ లో నాడు అరెస్టయి...
మసూద్ అజార్ బహవల్ పూర్ లోనే జన్మించాడు. 1968 ఆగస్టు 7వ తేదీన పుట్టిన మసూద్ అజార్ మిలిటెంట్ కార్యక్రమాల్లో ఆరితేరాడు. 1990 వ దశకంలో కాశ్మీర్ లో ప్రవేశించి ఉగ్రవాద కార్యక్రమాలను ప్రారంభించిన మసూద్ పాకిస్తాన్ తో పాటు ఐఎస్ఐ సహకారంతో జషే ఏ మహ్మద్ సంస్థను ఏర్పాటు చేశాడు. కాశ్మీర్ లో జరిగిన అనేక ఉగ్రదాడులకు ఇతనే కారణమని చెబుతారు. 1994లో అరెస్టయిన తర్వాత ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని హైజాక్ చేయడంతో 176 మంది ప్రయాణకుల ప్రాణాల కోసం వారి డిమాండ్ మేరకు మసూద్ అజార్ తో పాటు మరికొందరు మిలిటెంట్లను కూడా భారత్ విడిచిపెట్టాల్సి వచ్చింది. కాందహార్ లో నిలిచిన విమానంలో ఉన్న ప్రయాణికులను నాడు క్షేమంగా భారత్ కు తీసుకు రాగలిగింది.
ఈ సంస్థ ఏర్పడిందే...
జైష్ ఎ మహమ్మద్ ఉగ్రవా సంస్థ ఏర్పడిందే కాశ్మీర్ ను భారత్ నుంచి విడదీసి పాకిస్తాన్ లో కలపాలంటూ ఏర్పడింది. అందుకే కాశ్మీర్ లో మసూద్ అజర్ కార్యకలాపాలు ఎక్కువగా జరిగేవి. అందుకే ఈసారి బహవల్ పూర్ లోని జైషే ఏ మహ్మద్ ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు.అయితే ఈ దాడి నుంచి మసూద్ అజార్ తప్పించుకున్నారని చెబుతున్నారు. జైషే ఏ మహమ్మద్ సంస్థతో పాటు లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయాలపై ఆపరేషన్ సింధూర్ కు భారత ప్రభుత్వం దిగాల్సి వచ్చింది. అయితే ఈ దాడిలో మసూద్ అజార్ కుటుంబంలోని పది మంది చనిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. ఆయన సోదరితో పాటు భర్త, మేనల్లుడు ఇతరబంధువులు కూడా హతమయినట్లు వార్తలు అందుతున్నాయి. ప్రధాని మోదీ అన్ని యుద్ధనియమాలు ఉల్లంఘించారని, భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటానంటూ మసూద్ అజర్ లేఖ రాయడం విడ్డూరంగా ఉంది.
Next Story