Israel - Iran War : నెల రోజులు దాటినా.. ఆగని యుద్ధం.. ఇరాన్ అణుకేంద్రాలపై దాడులు
ఇజ్రాయెల్ ఇరాన్ అణు సదుపాయాలపై దాడులు చేసింది.

శుక్రవారం టెహ్రాన్పై తన దాడులను “మరింత విస్తరించి, తీవ్రతరం చేస్తాం” అని హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ ఇరాన్ అణు సదుపాయాలపై దాడులు చేసింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఇరాన్, సౌదీ అరేబియాలోని ఒక స్థావరంపై దాడి చేసింది. ఈ ఘటనలో అమెరికా సైనికులు గాయపడ్డారు. కొన్ని విమానాలకు నష్టం వాటిల్లింది. యుద్ధం నెల రోజులు దాటిన సమయంలో మాత్రం ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐక్యరాజ్యసమితి అభ్యర్థన మేరకు హోర్ముజ్ జలసంధి మార్గం నుంచిమానవతా సహాయం, వ్యవసాయ సరుకు రవాణాకు అనుమతి ఇస్తామని ఇరాన్ ప్రకటించింది. జెనీవాలో ఐక్యరాజ్యసమితి వద్ద తమ దేశ రాయబారి అలీ బహ్రేని ఈ విషయాన్ని వెల్లడించారు. “అత్యవసర సహాయం ఆలస్యం కాకుండా చేరేందుకు ఇరాన్ కట్టుబడి ఉంది” అని ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు. యుద్ధ ప్రభావంతో సహాయ సరఫరాలపై వచ్చిన అంతరాయాలపై చర్యల కోసం ఐక్యరాజ్యసమితి ఇప్పటికే ప్రత్యేక బృందం ఏర్పాటు చేసింది.

