Israel- Hezbollah : చర్చలపై దాడుల ప్రభావం.. హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య కుదరని సయోధ్య
హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య శుక్రవారం దాడులు మరింత ముదిరాయి

హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య శుక్రవారం దాడులు మరింత ముదిరాయి. ప్రారంభం కానున్న ప్రత్యక్ష చర్చల ముందు ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వచ్చే మంగళవారం వాషింగ్టన్, డీసీ లో చర్చలు మొదలవుతాయని జోసెఫ్ ఔన్ కార్యాలయం ప్రకటన చేసింది. శుక్రవారం ఇజ్రాయెల్, లెబనాన్, అమెరికా రాయబారుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఈ ప్రకటన విడుదలైంది. ఈ చర్చలు కాల్పుల విరమణ లేదా తాత్కాలిక విరమణ నేపథ్యంలో జరగాలని బీరూట్ తన అభిప్రాయాన్ని మరోసారి స్పష్టం చేసింది. అయితే అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబారి యెచియెల్ లీటర్ ఈ చర్చలను “అధికారిక శాంతి చర్చలు”గా పేర్కొన్నారు. సీజ్ఫైర్ అంశం చర్చల పట్టికలో లేదని తెలిపారు. ఇది అవన్ వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా ఉంది. “హెజ్బొల్లా అనే ఉగ్ర సంస్థతో సీజ్ఫైర్ చర్చలకు ఇజ్రాయెల్ నిరాకరించింది. ఆ సంస్థ ఇజ్రాయెల్పై దాడులు కొనసాగిస్తోంది. రెండు దేశాల మధ్య శాంతికి అది ప్రధాన అడ్డంకి” అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

