Israel -Iran War : ఇరాన్ ప్రయాణంలో యుద్ధపు ముద్రలు.. అయినా సాధారణ జీవితం
ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం ఆరోవారంలోకి ప్రవేశించింది.

ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం ఆరోవారంలోకి ప్రవేశించింది. అమెరికా, ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సర్వోన్నత నేత అయతొల్లా అలీ ఖామెనీ ఇచ్చిన హెచ్చరికలు ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. టర్కీ సరిహద్దు దాటి శనివారం ఇరాన్లోకి ప్రవేశించిన అసోసియేటెడ్ ప్రెస్ ప్రతినిధులు రాజధాని టెహ్రాన్ దిశగా 12 గంటల ప్రయాణం చేశారు. మార్గమధ్యంలో యుద్ధం ఆనవాళ్లు కనిపించినా, అనేక ప్రాంతాల్లో సాధారణ జీవనం కొనసాగుతున్న దృశ్యాలు వారు గమనించారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖామెనీ మృతి చెందిన ఐదు వారాలు గడిచినా యుద్ధం తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇరాన్ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చి అదనపు బృందాన్ని దేశంలోకి అనుమతించింది. ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న సంస్థకు చెందిన మీడియా సహాయకుడు ఈ బృందంతో ఉన్నాడు. అయినప్పటికీ, వార్తా కంటెంట్పై పూర్తి సంపాదకీయ నియంత్రణ APదేనని తెలిపింది.

