Iran - Israel War : నాలుగో వారంలోనూ కొనసాగుతున్న యుద్ధం
ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం మరింత తీవ్రమయింది

ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం మరింత తీవ్రమయింది. మృతుల సంఖ్య పెరుగుతోంది.దక్షిణ ఇజ్రాయెల్లో ఇరాన్ క్షిపణి దాడులు జరిగాయి. ఇళ్లకు భారీ నష్టం కలిగింది. పలువురు గాయపడ్డారు. ప్రధాన అణు పరిశోధన కేంద్రానికి సమీపంలో ఈ దాడులు చోటుచేసుకోవడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. అదే రోజు ముందుగా ఇరాన్లోని నాటాంజ్ అణు ఇంధన శుద్ధి కేంద్రంపై దాడి జరిగింది. దీనికి ప్రతిగా ఇరాన్ ఈ దాడులు చేసినట్లు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ సైన్యం తెలిపిన ప్రకారం, నెగెవ్ ఎడారిలో ఉన్న డిమోనా, అరాద్ నగరాలపై పడిన క్షిపణులను అడ్డుకోలేకపోయింది. డిమోనా ప్రాంతం అత్యంత భద్రత కలిగినదిగా భావిస్తారు. ప్రధాని బెంజమిన్ నేతన్యాహు సంఘటన స్థలానికి మరిన్ని అత్యవసర సిబ్బందిని పంపిస్తున్నామని చెప్పారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ గలీబాఫ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, “డిమోనా వంటి రక్షణ ఉన్న ప్రాంతంలో క్షిపణులు అడ్డుకోలేకపోవడం యుద్ధం కొత్త దశలోకి వెళ్లిన సంకేతం” అని పేర్కొన్నారు.

