Mon May 19 2025 14:20:37 GMT+0000 (Coordinated Universal Time)
Operation Sindoor : పాక్ ను కట్టడి చేసేందుకు భారత్ ప్రయత్నాలు.. అదే జరిగితే?
ఆపరేషన్ సిందూర్ తో పాటు పాక్ ను అన్ని విధాలుగా కట్టడి చేసేందుకు భారత్ చర్యలు తీసుకుంటుంది

ఆపరేషన్ సిందూర్ తో పాటు పాక్ ను అన్ని విధాలుగా కట్టడి చేసేందుకు భారత్ చర్యలు తీసుకుంటుంది. పాకిస్తాన్ ను అన్ని రకాలుగా దిగ్బంధనం చేసేందుకు భారత్ చర్యలు తీసుకుంటుంది. ఒకవైపు దాడులకు ప్రతీకారం తీర్చుకుంటూ సైనిక స్థావరాలపై దాడులు జరుపుతూనే మరొకవైపు ఆర్థికంగా పాక్ ను ఇరకాటంలో నెట్టే ప్రయత్నాలను మొదలుపెట్టింది. పాక్ తాను తీసుకునే రుణాలు ఉగ్రవాదుల కోసమే వినియోగిస్తుందని అంతర్జాతీయ సమాజం కూడా ఆఫ్ ది రికార్డుగా అంగీకరిస్తుంది. అయితే ఏ దేశమూ కూడా బహిరంగంగా ప్రకటన చేయలేదు. అయితే భారత్ మాత్రం ఇప్పటికే పాక్ కు సంబంధించి అన్ని ఆధారాలను సేకరించి వివిధ సంస్థలకు అందిస్తుంది. దీంతో పాక్ ను ఆర్థిక దిగ్బంధనం చేయాలన్న ఉద్దేశ్యంతో ఉంది.
ఉగ్రవాదులకు చేరే అవకాశముందని...
పాకిస్తాన్ కు నిధులు విడుదల చేస్తే ఉగ్రవాదులకు చేరే అవకాశముందని భారత్ పదే పదే చెబుతుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధికి కూడా తెలిపింది. దానికి కూడా పాక్ ఉగ్రవాదులకు నిధులు ఎలా చేరవేస్తుందన్న దానిపై స్పష్టం చేసింది. ఐఎంఎఫ్ పాక్ ు బెయిల్ అవుట్ ప్యాకేజీ ఇచ్చే విషయంపై పునరాలోచన చేయాలని భారత్ కోరింది. బెయిల్ అవుట్ ప్యాకేజీ కింద ఐఎంఎఫ్ 1.3 బిలియన్ డాలర్ల నిధులను అందచేయనుండటంతో దానిని ఆపాలని కూడా భారత్ స్పష్టం చేసింది. పాక్ కు ఇచ్చిన నిధులు ఉగ్రవాదులకు చేరతాయని దీనిని ఆలోచించుకోవాలని ఐఎంఎఫ్ ను భారత్ కోరడం విశేషం. దీంతో ఐఎంఎఫ్ కూడా పునరాలోచనలో పడిందని చెబుతున్నారు.
నేటి సమావేశంలో...
ఈరోజు ఐఎంఎప్ సమావేశంలో పాకిస్తాన్ కు బెయిల్ అవుట్ ప్యాకేజీ ఇవ్వాలా? వద్దా? అన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. పాక్ కు ఆ నిధులు విడుదల చేస్తే అవి ఉగ్రవాదులు చెంత చేరతాయని చెప్పడమే కాకుండా పాక్ తో ఉగ్రవాదుల సంబంధాలకు సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించినట్లు తెలిసింది. ఐఎంఎఫ్ నుంచి తీసుకున్న నిధులు దారిమళ్లిస్తున్న పాక్ ను కట్టడి చేయగలిగితే ఆర్థికంగా పాక్ ను కట్టడి చేసినట్లే అవుతుందని భావిస్తున్నారు. ఆ దిశగా భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఆపరేషన్ సిందూర్ లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలు కూడా పాక్ అధికారిక లాంఛనాలతో నిర్వహించడాన్ని ప్రస్తావించింది. మొత్తం మీద పాక్ ను కట్టడి చేయడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఐఎంఎఫ్ ఏ మేరకు స్పందిస్తుందన్నది చూడాల్సి ఉంది.
Next Story