Fri Dec 19 2025 00:38:05 GMT+0000 (Coordinated Universal Time)
ఇండోనేసియాలో భూకంపం
ఇండోనేసియాలో భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

ఇండోనేసియాలో భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రిక్టర్ స్కేల్ పై ఆరు గా నమోదు అయింది. ఈ మేరకు సుమత్రా ద్వీపం తీరంలోని భూకంప కేంద్రం అచే ప్రావిన్స్ లోని సింగ్ కిల్ నగరానికి దక్షిణాగ్నేయంగా 48 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు వెల్లడించారు.
భూకంపం కారణంగా...
అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అలాగే ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు కూడా లేదని అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భయపడాల్సిన పనిలేదని అధికారులు చెబుతున్నారు.
Next Story

