Thu Mar 19 2026 15:16:39 GMT+0530 (India Standard Time)
ఇండోనేషియాలో భూకంపం
ఇండోనేషియలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.5 గా నమోదయింది.

ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.5 గా నమోదయింది. అయితే భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం లేదని అధికారులు తెలిపారు. ఇండోనేషియాలో తరచూ భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. నిత్యం ప్రజలు భయం భయంగానే గడుపుతుంటారు.
సునామీ వార్నింగ్ వస్తేనే...
అయితే వీటికి అలవాటు పడిపోయిన ప్రజలు సునామీ హెచ్చరికలు వస్తేనే కొంత కలవర పడతారు. ఈ నేపథ్యంలో తాజాగా సంభవించిన భూకంప తీవ్రత వారికి పెద్దగా అనిపించలేదని అంటున్నారు. ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఆస్తినష్టం కూడా సంభవించలేదని చెప్పారు.
Next Story

