Fri Jan 30 2026 04:45:42 GMT+0000 (Coordinated Universal Time)
తొక్కిసలాట.. పదుల సంఖ్యలో చిన్నారుల మృతి
నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాలలో జరిగిన తొక్కిసలాటలో విద్యార్థులు మరణంచినట్లు అధికారులు తెలిపారు.

నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాలలో జరిగిన తొక్కసలాటలో అనేక మంది విద్యార్థులు మరణంచినట్లు అధికారులు తెలిపారు. హాలిడే ఫెయిర్ సందర్భంగా జరిగిన ఈ తొక్కిసలాటలో పదుల సంఖ్యలో విద్యార్ధులు మరణించారని చెబుతున్నారు. ఓయో రాష్ట్ర గవర్నర్ ఈ విషయాన్ని ధృవకీరించారు. నైజారియాలోని నైరుతి ప్రాంతంలో ఒక పాఠశాల నిర్వహించిన హాలిడే ఫెయిర్ సందర్భంగా తొక్కిసలాట జరిగింది.

హాలిడే ఫెయిర్ జరుగుతుండగా...
ఈ తొక్కిసలాటలో చిన్నారులు కొందరుమరణించినట్లు తెలిపారు. ఓయో రాష్ట్రంలోని ఇస్తామిక్ స్కూల్ లో జరిగిన ఈ ఘటన దేశంలోనే విషాదం నింపింది. సమాచారం తెలిసిన వెంటనే భద్రతాదళాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఎంత మంది మరణించారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషాదఘటనను నుంచి తేరుకోవడం కష్టమేనని, తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతిని ఓయో గవర్నర్ ప్రకటించారు.
Next Story

