Tue Oct 03 2023 06:41:25 GMT+0000 (Coordinated Universal Time)
భారీ భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు
మలేసియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.8 తీవ్రతగా నమోదయింది

మలేసియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.8 తీవ్రతగా నమోదయింది. ఒక్కసారి భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లల్లోనుంచి బయటకు పరుగులు తీశారు. అర్థరాత్రి సంభవించడంతో ఎక్కువ మంది గాఢ నిద్రలో ఉన్నారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్ నైరుతి దిక్కులో 504 కిలోమీటర్ల దూరంలో భూకం కేంద్రాన్ని గుర్తించారు
రెండు దేశాల్లోనూ....
మరోవైపు ఫలిప్పీన్స్ , ఇండోనేషియోలో కూడా భూకంపం సంభవించింది. ఫిలిప్పీన్స్ లో రిక్టర్ స్కేల్ పై 6.4 తీవ్రతగా నమోదయింది. మనీలా నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. ఇక ఇండోనేషియో లో వచ్చిన భూకంప తీవ్రత 6.6 గా నమోదయింది. అయితే ఎక్కడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
Next Story