అమెరికాలో మరోసారి కాల్పుల మోత
న్యూయార్క్లోని బఫెలో సూపర్ మార్కెట్లో పద్దెనిమిదేళ్ల ఓ శ్వేత జాతీయుడు జరిపిన కాల్పుల్లో 10 మంది అమాయకులు అక్కడికక్కడే..
అమెరికా రాష్ట్రం టెక్సాస్లోని అతిపెద్ద నగరమైన హ్యూస్టన్లోని ఫ్లీ మార్కెట్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఐదుగురు వ్యక్తుల మధ్య గొడవ కారణంగా ఆదివారం కాల్పుల ఘటన జరిగినట్లు హారిస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. బాధితులందరూ 20 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్నారని.. ఒకరికొకరు తెలిసివారే కావచ్చని అధికారులు తెలిపారు. కాల్పులు జరుగుతున్నప్పుడు ఆదివారం మధ్యాహ్నం ఫ్లీ మార్కెట్ చాలా బిజీగా ఉంది. హారిస్ కౌంటీ షెరీఫ్, ఎడ్ గొంజాలెజ్ మాట్లాడుతూ ఈ కాల్పులు జరిగినప్పుడు ఫ్లీ మార్కెట్ వద్ద వేలాది మంది ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మూడవ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలం నుంచి రెండు పిస్టల్స్ను స్వాధీనం చేసుకున్నట్లు షెరీఫ్ కార్యాలయం తెలిపింది.