Thu Jan 29 2026 05:33:14 GMT+0000 (Coordinated Universal Time)
రన్ వే పై చిరుత.. ఎటు వెళ్లిందబ్బా
శంషాబాద్ ఎయిర్ పోర్టులో తిరుగుతున్న చిరుతను పోలీసులు గుర్తించారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో తిరుగుతున్న చిరుతను పోలీసులు గుర్తించారు. విమానాశ్రయం రన్ వే పై చిరుత సంచారం ఉన్నట్లు గమనించిన పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విమానాశ్రయంలో ఉన్న పోలీసులు అటవీ శాఖ అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు.
అటవీ శాఖ సిబ్బంది...
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వేపై తిరుగుతున్న చిరుత ఎక్కడకు వెళ్లిందన్న దానిపై అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఎయిర్ పోర్టు అథారిటీ ఇటు తమ సిబ్బందిని, అటు ప్రయాణికులను అప్రమత్తం చేశారు. చిరుత విమానాశ్రయం పరిసర ప్రాంతంలోనే ఉండి ఉంటుందని భావిస్తున్నారు. అందుకోసం అటవీ శాఖ సిబ్బంది వెదుకులాట ప్రారంభించారు.
Next Story

