Thu Mar 19 2026 00:17:23 GMT+0530 (India Standard Time)
బాణాసంచా పేలడంతోనే ట్యాంక్ బండ్ లో పడవలు దగ్దం
హుస్సేన్ సాగర్ లో జరిగిన అగ్నిప్రమాదానికి గల కారణం బాణ సంచా పేలడమేనని పోలీసులు తెలిపారు

హుస్సేన్ సాగర్ లో జరిగిన అగ్నిప్రమాదానికి గల కారణం బాణ సంచా పేలడమేనని పోలీసులు తెలిపారు. భారతమాతకు మహా హారతి ముగింపు కార్యక్రమం సందర్భంగా హుస్సేన్ సాగర్ లోని బోట్ల నుంచి బాణసంచాల పేల్చుతున్న క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు. పడవలు మొత్తం దగ్దం అయ్యాయి. ప్రమాద సమయంలో బోటులో ఉన్న ఐదుగురూ నీళ్లలోకి దూకడంతో ప్రాణాలు దక్కాయి.
ఐదుగురు నీళ్లలోకి దూకి...
భారతమాతకు మహా హారతి కార్యక్రమం నిన్న హుస్సేన్ సాగర్ వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వంటి వీఐపీలు కూడా హాజరయ్యారు. వారు అలా వెళ్లిపోయిన మరు క్షణం ఈ ప్రమాదం జరిగింది. కార్యక్రమాన్ని ముగించే సందర్భంలో ఐదుగురు సిబ్బంది జెట్టీ ద్వారా బాణా సంచా పేల్చుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు కావాడంతో అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story

