Sat May 24 2025 13:34:11 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి హైదరాబాద్ లో వీటిపై నిషేధం
నేటి నుంచి హైదరాబాద్ లో కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీస్ కమిషన్ సీవీ ఆనంద్ తెలిపారు

నేటి నుంచి హైదరాబాద్ లో కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీస్ కమిషన్ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో బాణాసంచా కాల్చడంపై పోలీసులు నిషేధం విధించారు. పెళ్లిళ్లు, పండుగలు, షాపుల ప్రారంభోత్సవాలు వంటి ఏ సందర్భంలోనైనా సరే బాణాసంచా కాల్చడం పై నిషేధం ఉంటుందని తెలిపారు. బాణాసంచా అమ్మేవారికి కూడా హెచ్చరికలు జారీ చేశారు. బాణాసంచా కాలిస్తే జైలుకు పంపుతామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నిషేధానికి ప్రధాన కారణం దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులేపి హైదరా బాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
ఆంక్షలు ఉల్లంఘిస్తే...
దేశంలో యుద్ధ వాతా వరణం నెలకొనడం, నగరంలో భద్రతా చర్యలు కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. బాణాసంచా శబ్దాలు పేలుళ్లుగా అన్వయించు కునే ప్రమాదం ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొనే అవకాశం ఉందని చెప్పారు. ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించవచ్చని, అంతేకాకుండా, బాణాసం చా శబ్దాలు భద్రతా దళాలపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తాచపి. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో, బాణాసంచా కాల్చడం వల్ల ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే స్పందించడం కష్టమవుతుందని సీవీ ఆనంద్ తెలిపారు. ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
Next Story