Fri Dec 05 2025 09:22:41 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఉగాది రోజున హైదరాబాద్ వాసులకు మెట్రో బపంపర్ ఆఫర్
మెట్రో రైలు యాజమాన్యం హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

మెట్రో రైలు యాజమాన్యం హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉగాది రోజు నుంచి ఈ ఆఫర్ ను అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. హాలిడే కార్డ్్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్లను పొడిగిస్తూ మెట్రో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటన చేసింది.
రేపటినుంచి...
రేపటి నుంచి ఈ ఆఫర్లు మరో ఆరు నెలలపాటు అందుబాటులో ప్రయాణికులకు ఉండనున్నాయి. ఇటీవల రాయితీలతో కూడిన ప్రయాణాలను రద్దు చేయడంతో హైదరాబాద్ వాసుల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తం కావడంతో మెట్రో యాజమాన్యం దీనిపై పునరాలోచించి ఆరు నెలలు రాయితీలను పొడిగించాలని నిర్ణయించింది.
Next Story

