Mon Dec 15 2025 20:26:25 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ కాంగ్రెస్ నేతల సమావేశం
హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం జరగనుంది.

ఈరోజు ఉదయం పదకొండు గంటలకు గాంధీభవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం జరగనుంది. సమావేశానికి ముఖ్య అతిథిగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరుకానున్నారు. జూలై 4 వ తేదీన హైదరాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్న సభ ఏర్పాట్ల పై సన్నాహక సమావేశం జరగనుంది.
ఖర్గే పర్యటన నేపథ్యంలో...
ఈ సమావేశంలో హైదరాబాద్ జిల్లా కి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు, జీహెచ్ ఎంసీ మేయర్ , జిల్లా అధ్యక్షులు , కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు , పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు , ముఖ్య నేతలు పాల్గొననున్నారు. హైదరాబాద్ లో జరిగే సభ విజయవంతం పై ముఖ్య నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు దిశా నిర్దేశం చేయనున్నారు.
Next Story

