Thu Jan 01 2026 08:07:32 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : నేటి నుంచి ఎగ్జిబిషన్ ప్రారంభం
హైదరాబాద్ లో నేటి నుంచి ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది.

హైదరాబాద్ లో నేటి నుంచి ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. జనవరి వస్తుందంటే హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ ను ఏర్పాటు చేస్తారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులందరూ వచ్చి ఇక్కడ తమ అమ్మకాలను కొనసాగిస్తారు. నుమాయిష్ లో తక్కువ ధరకు నాణ్యమైన వస్తువుల లభిస్తాయని నగరవాసుల నమ్మకం.
ఫిబ్రవరి పదిహేనో తేదీ వరకూ...
అన్ని వస్తువులు ఒకే చోట దొరుకుతుండటంతో సందర్శకులు ప్రతి ఏడాది పోటెత్తుతారు. ప్రతి ఏటా నుమాయిష్ జనవరి 1వ తేదీన ప్రారంభమవుతుంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. వందల సంఖ్యలో స్టాల్స్ ఈసారి నగరవాసులను అలరించనున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ నెలన్నర రోజులు నుమాయిష్ ను సందర్శించి ఆనందించే వీలుంది. నమాయిష్ ను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు.
Next Story

