Tue Dec 23 2025 10:03:47 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : కోటి రూపాయలు కొట్టేసిన కేటుగాళ్లు
బంజారాహిల్స్లో కోటి రూపాయల క్రిప్టో మోసం జరిగింది

బంజారాహిల్స్లో కోటి రూపాయల క్రిప్టో మోసం జరిగింది. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని మోసం చేసిన ఘటన బంజారాహిల్స్లోని తాజ్ డెక్కన్ హోటల్ సమీపంలో చోటుచేసుకుంది. అత్తాపూర్కు చెందిన ఓ వ్యక్తిని, తనకు పరిచయం ఉన్న స్నేహితుడి ద్వారా పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు.
తాజ్ డెక్కన్ కు రమ్మని...
మధ్యవర్తి ద్వారా తాజ్ డెక్కన్ హోటల్ వద్ద కలిసిన నిందితుడు లాభాలు ఇప్పిస్తామని చెప్పి, పార్కింగ్ స్థలం నుంచి నగదు కోటి రూపాయలు నగదు తీసుకుని పరారయ్యాడు. బాధితులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
Next Story

