Sun Mar 15 2026 04:40:09 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి బయో ఏషియా సదస్సు
నేటి నుంచి హైదరాబాద్లో బయో ఏషియా సదస్సు జరగనుంది.

నేటి నుంచి హైదరాబాద్లో బయో ఏషియా సదస్సు జరగనుంది. బయో ఏషియా సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ బయ ఏషియో సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. సదస్సులో అనేక అంశాలపై చర్చ జరుగుతుంది. ప్రజలకు ఉపయోగపడే వివిధ అంశాలపై చర్చలతో పాటు ప్రసంగాలు కూడా ఉండనున్నాయి.
అనేక అంశాలపై...
హైదరాబాద్ లో నేటి నుంచి జరుగుతున్న ఈ బయో ఏషియో సదస్సుకు యాభై దేశాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ సదస్సులో ప్రధానంగా లైఫ్సైన్సెస్, ఆరోగ్యం, ఔషధ రంగాల అభివృద్ధిపై చర్చలు నిర్వహించనున్నారు. రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Next Story

