హైదరాబాద్ లో మరో ఐకానిక్ బ్రిడ్జి సిద్ధం
హైదరాబాద్లోని మీరాలం చెరువుపై 430 కోట్ల రూపాయలతో సరికొత్త ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

హైదరాబాద్లోని మీరాలం చెరువుపై 430 కోట్ల రూపాయలతో సరికొత్త ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2.5 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన చింతల్మెట్ నుండి శాస్త్రిపురం వరకు విస్తరించనుంది. ఇది పర్యాటకంగానూ కీలకంగా మారనుంది. మూసీ నది అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర పురపాలకశాఖ అనుమతి మంజూరు చేసింది. బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, టెండరు ప్రక్రియను ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించనున్నారు.
ఐకానిక్ బ్రిడ్జి పొడవు 2.5 కి.మీ ఉండనుంగా, వెడల్పు 16.5 మీటర్లు ఉండనుంది. ఈ బ్రిడ్జిని చెరువుకు పశ్చిమాన ఉన్న చింతల్మెట్, తూర్పున శాస్త్రిపురం నుంచి సాగిపోయే బెంగళూరు నేషనల్ హైవేను కలిపేలా నిర్మించనున్నారు. చెరువు మధ్యలో మూడు దీవులుంటాయి. చెరువు నిర్మించినప్పుడు దీని విస్తీర్ణం 600 ఎకరాలు కాగా ప్రస్తుతం అది 450ఎకరాలకు పరిమితమైంది

