Fri Dec 05 2025 23:23:17 GMT+0000 (Coordinated Universal Time)
భార్యపై కోపంతో బాంబు బెదిరింపు
భార్య పై కోపం తో ప్రజాభవన్ కి బాంబు బెదిరింపు కాల్ చేసినట్లు నిందితుడు శివకుమార్ చెప్పాడు

భార్య పై కోపం తో ప్రజాభవన్ కి బాంబు బెదిరింపు కాల్ చేసినట్లు నిందితుడు శివకుమార్ చెప్పాడు. నిన్న ప్రజాభవన్ లో బాంబు పెట్టామని బెదిరించిన కాల్ తో అప్రమత్తమయిన పోలీసులు వెంటనే ప్రజా భవన్ లో తనిఖీలు చేశారు. బాండ్ స్క్కాడ్ తో తనిఖీలు చేయగా అది ఉత్తుత్తి కాల్ అని తేలింది. దీంతో కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.
ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో...
కాల్ చేసిన వ్యక్తి మల్కాజ్గిరికి చెందిన శివకుమార్ గా గుర్తించారు. మద్యానికి బానిసయిన శివకుమార్ తరచూ తన భార్యతో గొడవ పడేవాడు. దీంతో భార్య కోపమొచ్చి పుట్టింటికి వెళ్లింది. దీంతో శివకుమార్ ఒంటరిగా ఉంటున్నాడు. నిన్న భార్యకు ఫోన్ చేసిన కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో భార్యపై కోపంతో హైదరాబాద్ లో అనేక చోట్ల బాంబు పెట్టానని కంట్రోల్ రూమ్ కి కాల్ చేసినట్లు శివకుమార్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.
Next Story

