Fri Dec 05 2025 07:08:51 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ప్రియాంక గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్న వీడియో బీహార్లో ఇటీవల జరిగిన ర్యాలీ కి చెందినది కాదు
"ఓటరు అధికార్ యాత్ర" ను ఆగస్టు 2025లో బీహార్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. 16 రోజుల ఈ

Claim :
బీహార్లో ఇటీవల జరిగిన ఓటర్ల హక్కుల ర్యాలీలో ప్రియాంక గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు చేశారుFact :
ప్రధాని మోదీ గురించి ప్రియాంక మాట్లాడిన వీడియో ఇటీవలిది కాదు, ఇది నవంబర్ 2023 నాటిది
"ఓటరు అధికార్ యాత్ర" ను ఆగస్టు 2025లో బీహార్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. 16 రోజుల ఈ పాదయాత్ర 25 జిల్లాలను కవర్ చేసింది. బీజేపీ, భారత ఎన్నికల కమిషన్ (ECI) ఎన్నికల దుర్వినియోగాన్ని బహిర్గతం చేయడానికి, ఈసీ తీరుపై నిరసన తెలియజేయడానికి ఈ యాత్రను ఉద్దేశించారు. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ పక్షం రోజుల్లో 1,300 కి.మీ., 25 జిల్లాలలోని దాదాపు 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రయాణించిన తర్వాత సెప్టెంబర్ 1న ఓటరు అధికార్ యాత్రను ముగించారు, రాబోయే బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎప్పుడూ లేనంతగా విజయం సాధిస్తుందని ఆశాభావంతో ఉంది. రాహుల్ గాంధీ 'ఓటు చోర్, గడ్డి చోర్' నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. బీహార్లోని సుపౌల్లో జరిగిన ఓటు అధికార్ యాత్రలో ప్రియాంక గాంధీ వాద్రా కూడా తన సోదరుడితో కలిసి పాల్గొన్నారు.
ఇంతలో, ప్రియాంక గాంధీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భారత ప్రధాని మోదీని ప్రియాంక గాంధీ ‘తేరే నామ్’ సినిమాలో సల్మాన్ ఖాన్ లాగానే ఉన్నారని చెప్పడం వినొచ్చు. “Trivializing the abuse hurled at PM Modi’s late mother is appalling. Trust @INCIndia leaders to drag the political discourse to new lows every time they speak.” అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేశారు.
మరికొందరు అదే వీడియోను షేర్ చేస్తూ, "తేరే నామ్ సినిమాలో సల్మాన్ ఖాన్ ప్రారంభం నుండి చివరి వరకు ఏడుస్తూనే ఉన్నట్లే, మోడీ జీ కూడా ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు, ఆయనపై కూడా ఒక సినిమా తీయాలి, దాని పేరు "మేరే నామ్" అని ఉండాలి - కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ" అంటూ పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. వైరల్ వీడియో ఇటీవలిది కాదు, ఇది 2023 సంవత్సరం నాటి పాత వీడియో.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్లను తీసుకుని, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికినప్పుడు, ఆ వీడియో పాతదని మేము కనుగొన్నాము. ఇదే వీడియోను ది ఎకనామిక్ టైమ్స్ యూట్యూబ్ ఛానల్ “'Modi ji rote hi rahte hain': Priyanka Gandhi suggests 'Mere Naam' movie on PM”. అనే శీర్షికతో షేర్ చేసింది. వీడియో వివరణలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. ప్రధాని ప్రసంగాల సమయంలో తరచుగా ఏడుస్తున్నందున, సల్మాన్ ఖాన్ 'తేరే నామ్' లాంటి టైటిల్తో 'మేరే నామ్' అనే సినిమాను నిర్మించాలని ఆమె సూచించారు. ఈ వీడియో నవంబర్ 15, 2023న అప్లోడ్ చేశారు.
మధ్యప్రదేశ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక మాట్లాడుతూ, ప్రధాని మోదీ ఎప్పుడూ తన సొంత సమస్యల గురించే మాట్లాడుతారని అన్నారు. "కర్ణాటకకు వెళ్ళినప్పుడు, తనను చాలా వేధించారని చెప్పారు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తనను వేధించారని అన్నారు. ఆయన ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు" అని ప్రియాంక వ్యాఖ్యానించారు. సల్మాన్ ఖాన్ సినిమా తేరే నామ్ను ప్రస్తావిస్తూ, "మోదీ జీ కోసం కూడా ఒక సినిమా తీద్దాం, దాని పేరు మేరే నామ్" అని ఆమె అన్నారు.
మోదీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరికివాళ్ళను, దేశద్రోహులను తన పార్టీలోకి తీసుకువచ్చారని ఆమె ఆరోపించారు. "బీజేపీ, ఆర్ఎస్ఎస్లోని మంచి కార్యకర్తల పట్ల నాకు జాలిగా ఉంది" అని ఆమె అన్నారు. ప్రియాంక ప్రసంగం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్లోని దాటియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ప్రధానమంత్రి మోదీపై తీవ్ర విమర్శలు చేశారని ఫ్రీప్రెస్ జర్నల్లో వచ్చిన కథనం పేర్కొంది. "ఆయన కర్ణాటకకు వెళ్లి తాను ఎదుర్కొన్న వేధింపులను చెప్పారు... ఆయన ఏడుస్తూనే ఉన్నట్లు కనిపిస్తోంది. మీరు సల్మాన్ ఖాన్ 'తేరే నామ్' సినిమా చూశారా? ఆ సినిమాలో, సల్మాన్ ఖాన్ మొదటి నుండి చివరి వరకు ఏడుస్తూనే ఉంటారు. ప్రధాని మోదీపై సినిమా తీసి దానికి 'మేరే నామ్ (నా పేరు) అని పేరు పెట్టాలని నేను సూచిస్తున్నాను" అని ప్రియాంక గాంధీ ప్రధానమంత్రిని విమర్శిస్తూ అన్నారు. "నరేంద్ర మోదీ ఎప్పుడూ తన సొంత సమస్యలతో బాధపడే భారతదేశపు మొదటి ప్రధాని." అని ఆమె అన్నారు.
ఆగస్టు 26, 2025న బీహార్లోని సిపాల్లో జరిగిన ఓట్ అధికార్ యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొనడం గురించిన కథనాల కోసం తెలుగుపోస్ట్ టీమ్ వెతికింది. కానీ సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేసినట్లుగా ఆమె ప్రధానమంత్రి మోదీపై వైరల్ వ్యాఖ్యలు చేయలేదు.
కనుక, వైరల్ అవుతున్న వీడియో నవంబర్ 2023 నాటి పాతది, బీహార్ ఎన్నికలకు లేదా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఓటరు అధికార్ యాత్రకు సంబంధించినది కాదు.
Claim : బీహార్లో ఇటీవల జరిగిన ఓటర్ల హక్కుల ర్యాలీలో ప్రియాంక గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : Misleading
Next Story

