ఫ్యాక్ట్ చెక్: పశ్చిమ బెంగాల్ లో జరిగిన అల్లర్లను వైరల్ వీడియో చూపడం లేదు, ఇది బాంగ్లాదేశ్ కు చెందినది
ఏప్రిల్ 11న వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో హింస చెలరేగి ముగ్గురు మరణించగా, డజన్ల కొద్దీ ప్రజలు

Claim :
2025 ఏప్రిల్లో పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో దళిత హిందూ మహిళ ఇంటిని తగలబెట్టిన దృశ్యాలు వైరల్ వీడియోలో చూడవచ్చుFact :
ఆ వీడియో పశ్చిమ బెంగాల్కు సంబంధించింది కాదు. అది చిట్టగాంగ్ (చట్టోగ్రాం), బంగ్లాదేశ్లోని ఒక మురికివాడలో జరిగిన అగ్నిప్రమాద దృశ్యాలను చూపుతోంది
ఏప్రిల్ 11న వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో హింస చెలరేగి ముగ్గురు మరణించగా, డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. ఇళ్లు, వ్యాపారాలు ధ్వంసమయ్యాయి, అనేకమంది నిరాశ్రయులయ్యారు. కొందరు మాల్డాలోని సహాయ శిబిరాల్లో తలదాచుకోగా, మరికొందరు జార్ఖండ్లోని పాకుర్ జిల్లాకు వలస వెళ్లారు. కోల్కతా హైకోర్టు ముర్షిదాబాద్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర బలగాలను మోహరించాల్సిందిగా ఆదేశించింది. ఈ ఘటన తర్వాత, నబా గ్రామ్ కంటోన్మెంట్లోని కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్ (ఛంఫ్) యూనిట్ వద్ద సైనికుల కోసం ఒక హెల్ప్లైన్ ఏర్పాటు చేయబడింది. నబా గ్రామ్ ముర్షిదాబాద్ జిల్లాలో ఒక భాగం. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2014లో ఈ సైనిక స్థావరం నిర్మాణం కోసం 250 ఎకరాల భూమిని విడుదల చేసింది.
ఈ పరిస్థితిలో, ఏడుస్తూ విలేకరులతో బెంగాలీలో మాట్లాడుతున్న మహిళలను చూపిస్తున్న, అలాగే తగలబడుతున్న ఇళ్లను చూపుతున్న వీడియో ఒకటి ప్రచారంలో ఉంది. దాని శీర్షిక "ఒక దళిత సోదరి ఇల్లు కాల్చేసారు. దళిత (శ్ఛ్) కాలనీ మొత్తం దహనం చేశారు. దహనం చేయబోయే ముందు ఇళ్ళు మొత్తం లూటీ చేశారు. బంగారం, డబ్బు, బియ్యం, సరుకులు దేన్ని వదలలేదు! ఇంకా కక్ష తీరక మొత్తం కాలనీ అగ్నికి ఆహుతి చేశారు.. ఇస్లాం లోకి మతం మారు లేదా జిజియా పన్ను కట్టమని అల్టిమేటం. ఇదీ పశ్చిమ బెంగాల్ హిందువుల దారుణ పరిస్తితి. మణిపూర్, ఉత్తర ప్రదేశ్ గురించి మాట్లాడిన, ప్రదర్శనలు చేసిన ఏ కుక్క ఇప్పుడు మాట్లాడటం లేదు. ఎందుకంటే అక్కడ నాశనం అవుతున్నది హిందువులు గనుక. పశ్చిమ బెంగాల్ హిందువులను రక్షించండి నమో భారత్"
క్లెయిం ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
ఈ వాదన తప్పుదోవ పట్టిస్తోంది. ఈ వీడియో పశ్చిమ బెంగాల్కు సంబంధించింది కాదు. ఇది చిట్టగాంగ్, బంగ్లాదేశ్లో జరిగిన అగ్నిప్రమాద దృశ్యాలను చూపుతోంది.
వైరల్ వీడియోలోని ముఖ్యమైన ఫ్రేమ్లను తీసి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి వెతికినప్పుడు, 'చిట్టోగ్రామ్లో అగ్నిప్రమాదం' అనే శీర్షికతో అనేక యూట్యూబ్ వీడియోలు కనిపించాయి.
మరింత పరిశోధనలో, ఈ అగ్నిప్రమాదం గురించి కొన్ని వార్తా కథనాలు లభించాయి. ది బిజినెస్స్టాండర్డ్ ప్రకారం, ఏప్రిల్ 15న ఉదయం చిట్టోగ్రామ్లోని సీఆర్బీ ప్రాంతంలోని గోల్పారా మురికివాడలో 14 తాత్కాలిక మరియు పాక్షిక శాశ్వత గృహాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఛట్టోగ్రామ్ ఫైర్ సర్వీస్ మరియు సివిల్ డిఫెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ అన్వర్ హుస్సేన్ తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 5:30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న వెంటనే, ఐదు అగ్నిమాపక యూనిట్లు సంఘటనా స్థలానికి చేరుకుని ఉదయం 8 గంటలకల్లా మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదంలో సుమారు 16 లక్షల రూపాయల నష్టం వాటిల్లగా, 48 లక్షల రూపాయల విలువైన ఆస్తులను అగ్నిమాపక సిబ్బంది రక్షించగలిగారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సహాయ సంచాలకులు తెలిపారు.
అబ్జర్వర్ BD ప్రకారం, ఛట్టోగ్రామ్లోని కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీఆర్బీ మాలిపారా మురికివాడలో మంటలు చెలరేగడంతో కనీసం 20 మురికివాడ ఇళ్ళు ధ్వంసమయ్యాయి. చాలా మంది మురికివాడ వాసులు నిద్రిస్తుండగా మంటలు చెలరేగడంతో తమ ఇళ్లలోని వస్తువులను ఏమీ కాపాడుకోలేకపోయారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, గ్యాస్ సిలిండర్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.
ఈ వాదన ను మరి కొన్ని ఫ్యాక్ట్ చెక్ సంస్థలు పరిశోధించి వెస్ట్ బెంగాల్ కు సంబంధించినది కాదని తేల్చి చెప్పాయి. కనుక, ఇళ్ళు కాలిపోతున్న దృశ్యాలు, మహిళలు ఏడుస్తున్న దృశ్యాలు ముర్షిదాబాద్, పశ్చిమ బెంగాల్లో జరిగిన నిరసనలకు సంబంధించినవి కావు. దళిత మహిళ ఇంటి ని అల్లరి మూకలు ద్వంసం చేసాయనే వాదన తప్పుదోవ పట్టిస్తోంది.