ఫ్యాక్ట్ చెక్: పాకిస్థాన్ తో యుద్ధం కారణంగా భారత సైనికులు ఏడుస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడిలో 26 మంది మృతి చెందినందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ పాకిస్తాన్ ,ఆక్రమిత కాశ్మీర్లోని

Claim :
భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య భారత సైనికులు యుద్దం చేయలేమంటూ తమ పోస్టులను వదిలివెళుతున్నారుFact :
వైరల్ వీడియో పాతది, ఇటీవలి భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతలకు సంబంధించినది కాదు.
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడిలో 26 మంది మృతి చెందినందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ పాకిస్తాన్ ,ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించిన తర్వాత, పాకిస్తాన్ భారతదేశం పశ్చిమ సరిహద్దుల్లోని వివిధ ప్రదేశాలలో డ్రోన్, క్షిపణి దాడులను ప్రారంభించింది. భారత సాయుధ దళాలు వాయు రక్షణ వ్యవస్థలను ఉపయోగించి వాటిని అడ్డుకున్నాయి. సైన్యం, X (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేసిన పత్రికా ప్రకటనలో, “ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ సాయుధ దళాలు 2025 మే 08- 09 మధ్య రాత్రి మొత్తం పశ్చిమ సరిహద్దులో డ్రోన్లు, ఇతర మందుగుండు సామగ్రిని ఉపయోగించి బహుళ దాడులను ప్రారంభించాయి. జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు అనేక కాల్పుల విరమణ ఉల్లంఘనలకు తెగబడ్డాయి. వాటికి భారత్ సరైన సమాధానం ఇచ్చింది. భారత సైన్యం డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత ఆర్మీ దేశం సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉంది.” అంటూ పోస్టు పెట్టింది.