Fri Dec 05 2025 16:48:26 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఉచిత బస్సు పధకం వల్ల సీట్ల కోసం ఆంధ్ర ప్రదేశ్ లో మహిళలు కొట్టుకుంటున్నారనేది అబద్దం
గత నాలుగు రోజుల్లో 47 లక్షల మంది మహిళలు APSRTC బస్సుల్లో జీరో ఫేర్ టిక్కెట్లతో ప్రయాణించారని, రూ.19 కోట్ల వరకు ఖర్చు

Claim :
AP ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన తర్వాత, మహిళా ప్రయాణికుల మధ్య గొడవలు పెరుగుతున్నాయని వైరల్ వీడియోలో చూడవచ్చుFact :
ఈ వీడియో పాతది, జనవరి 2024 నాటిది, తెలంగాణకు సంబంధించింది. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సంబంధించినది కాదు
ఆంధ్రప్రదేశ్ లో గత నాలుగు రోజుల్లో 47 లక్షల మంది మహిళలు APSRTC బస్సుల్లో జీరో ఫేర్ టిక్కెట్లతో ప్రయాణించారని, రూ.19 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ప్రకటించారు. APSRTC సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ పథకం కింద ఘాట్ రోడ్లలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేయడానికి ఆయన సమ్మతి తెలిపారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని పొందడానికి మహిళలు డిజిలాకర్ యాప్లో ఆధార్ వంటి ఐడి కార్డులను ఫోటోకాపీ లేదా సాఫ్ట్ కాపీలో అనుమతించాలని అధికారులను ఆదేశించారు. మహిళలు ప్రయోజనం పొందేలా RTC బస్సుల లోపల, వెలుపల ఉచిత బస్సు ప్రయాణ పథకం గురించి డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఇంతలో, ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించిన అనేక పాత వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. RTC బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు మహిళలు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నట్లు చూపించే ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది, స్త్రీ శక్తి ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తున్న తర్వాత, ఆంధ్రప్రదేశ్లోని బస్సులలో సీట్ల కోసం మహిళలు గొడవ పడుతున్నారనే వాదనతో ఈ వీడియోలను షేర్ చేస్తున్నారు. “ఏపీలో ఇటీవల ప్రారంభమైన ఉచిత బస్సు పథకం కారణంగా బస్సులో సీట్ల కోసం మహిళా ప్రయాణీకుల మధ్య గొడవ జరిగింది. విజయనగరం నుంచి కొత్తవలస వెళ్లే బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది” అంటూ పోస్టులు పెట్టారు. వీడియోలో, మహిళలు ఒకరినొకరు కొట్టడం, జుట్టు లాగడం, గొడవ సమయంలో పక్కన ఉన్న పిల్లలను పట్టించుకోకుండా ఉండటం మనం చూడవచ్చు.
ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఈ వీడియో జనవరి 2024 నాటిది తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటన.
వీడియో నుండి కీ ఫ్రేమ్లను సంగ్రహించి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి శోధించగా, ఆ వీడియో జనవరి 1, 2024న ఒక జర్నలిస్ట్ X ఖాతాలో “Telangana govt offered #FreeBusTravelForWomen but not for free fight. Women fought over seats in the TSRTC bus during traveling from #Zaheerabad to #Sangareddy. #Telangana #telanganafreebus #TSRTC” అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసినట్లు మేము కనుగొన్నాము.
మరొక ఎక్స్ యూజర్ “ఫ్రీ బస్ ఎఫెక్ట్!! జహీరాబాద్ నుండి సంగారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం గొడవ.. దారుణంగా కొట్టుకున్న మహిళలు.” అంటూ పోస్టు పెట్టారు.
జహీరాబాద్ - సంగారెడ్డి (తెలంగాణ) లోని RTC బస్సులో జరిగిన పోరాటానికి సంబంధించిన పాత వీడియో అని, తప్పుడు వాదనలతో వైరల్ అవుతోందని పేర్కొంటూ X యూజర్ అదే వీడియోను షేర్ చేశారు. పుకార్లను నమ్మవద్దని సూచించారు.
జనవరి 2, 2024న Z న్యూస్లో ప్రచురితమైన ఒక వార్తా కథనాన్ని కూడా మాకు లభించింది, అది వైరల్ వీడియో తెలంగాణలోని ప్రభుత్వ బస్సులో మహిళల మధ్య జరిగిన తీవ్రమైన ఘర్షణను చిత్రీకరించారు. ఉచిత సీట్ల కోసం జరిగిన ఈ ఘర్షణ, జహీరాబాద్ నుండి సంగారెడ్డికి వెళుతున్న బస్సులో చోటు చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కనుక, వైరల్ అవుతున్న వీడియో జనవరి 2024లో తెలంగాణలోని బస్సులో మహిళల మధ్య జరిగిన గొడవను చూపించే పాత వీడియో. ఈ వాదన నిజం కాదు.
Claim : AP ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన తర్వాత, మహిళా ప్రయాణికుల మధ్య గొడవలు పెరుగుతున్నాయని వైరల్ వీడియోలో చూడవచ్చు
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story

