Fri Dec 05 2025 10:51:59 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఒడిశాకు చెందిన విజువల్స్ ను ఏపీలో ప్రజలు స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు
ఒడిశాకు చెందిన విజువల్స్ ఇవి. అది కూడా గతంలో చోటు చేసుకున్న

Claim :
ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్లను ప్రజలు ధ్వంసం చేశారుFact :
ఒడిశాకు చెందిన విజువల్స్ ఇవి. అది కూడా గతంలో చోటు చేసుకున్న ఘటన
స్మార్ట్ మీటర్లకు సంబంధించిన చర్చ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. పలు రాష్ట్రాలలో స్మార్ట్ మీటర్ల కారణంగా విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తోందంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు.
త్రిపుర రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లను వాడుతూ ఉన్నందున ప్రజలు, ప్రభుత్వం, విద్యుత్ అధికారుల మధ్య అంతరం పెరుగుతోంది. పెరుగుతున్న బిల్లులు, పేలవమైన కమ్యూనికేషన్, ప్రజలకు అవగాహన లేకపోవడం విస్తృతమైన గందరగోళం, అశాంతికి ఆజ్యం పోశాయి. త్రిపుర స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్ (TSECL) 89,000 కంటే ఎక్కువ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడంపై త్రిపుర రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు పెరుగుతున్న విద్యుత్ బిల్లులు, వివరించలేని ఛార్జీలు, తరచుగా విద్యుత్ కోతలు ఎదుర్కొంటున్నారని, దీని వలన ప్రజల నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
స్మార్ట్ మీటర్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగమైనప్పటికీ, అమలుకు ముందు తమకు సరైన సమాచారం అందించలేదని చాలా మంది నివాసితులు అంటున్నారు. స్మార్ట్ మీటర్లు ఎలా పనిచేస్తాయో అర్థం కాకపోవడంతో ప్రజలు నిరసన తెలుపుతున్నారు. కొత్త వ్యవస్థ సాధారణంగా వచ్చే కరెంట్ బిల్లులను పెంచిందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఈ వ్యవస్థ ఆధునీకరణ కోసమే అని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, నమ్మకం లేకపోవడం, తప్పుడు సమాచారం ప్రజల ఆగ్రహానికి కారణం అవుతూనే ఉన్నాయి. పారదర్శక కమ్యూనికేషన్, ఫిర్యాదులపై వేగవంతంగా చర్యలు తీసుకోకపోవడం, స్మార్ట్ మీటరింగ్ వ్యవస్థపైన, విద్యుత్ శాఖపైన ప్రజల విశ్వాసం క్షీణించేలా చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు రోడ్ల మీదకొచ్చి స్మార్ట్ మీటర్లను పగులగొడుతున్నారంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
"జయహో స్మార్ట్ మీటర్...??
#CBNFailedCM #AndhraPradesh" అంటూ పోస్టులు పెడుతున్నారు.
స్మార్ట్ మీటర్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగమైనప్పటికీ, అమలుకు ముందు తమకు సరైన సమాచారం అందించలేదని చాలా మంది నివాసితులు అంటున్నారు. స్మార్ట్ మీటర్లు ఎలా పనిచేస్తాయో అర్థం కాకపోవడంతో ప్రజలు నిరసన తెలుపుతున్నారు. కొత్త వ్యవస్థ సాధారణంగా వచ్చే కరెంట్ బిల్లులను పెంచిందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఈ వ్యవస్థ ఆధునీకరణ కోసమే అని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, నమ్మకం లేకపోవడం, తప్పుడు సమాచారం ప్రజల ఆగ్రహానికి కారణం అవుతూనే ఉన్నాయి. పారదర్శక కమ్యూనికేషన్, ఫిర్యాదులపై వేగవంతంగా చర్యలు తీసుకోకపోవడం, స్మార్ట్ మీటరింగ్ వ్యవస్థపైన, విద్యుత్ శాఖపైన ప్రజల విశ్వాసం క్షీణించేలా చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు రోడ్ల మీదకొచ్చి స్మార్ట్ మీటర్లను పగులగొడుతున్నారంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
"జయహో స్మార్ట్ మీటర్...??
#CBNFailedCM #AndhraPradesh" అంటూ పోస్టులు పెడుతున్నారు.
వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో ఒడిశా రాష్ట్రానికి సంబంధించింది.
స్మార్ట్ మీటర్ల గురించి ఓ వైపు చర్చ జరుగుతూ ఉండగా, స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఏర్పాటు వల్ల వినియోగదారులపై అదనపు భారం పడదని ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL) స్పష్టం చేసింది. APSPDCL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె. సంతోష్ రావు మాట్లాడుతూ, స్మార్ట్ మీటర్ అమలుకు సంబంధించి ఎటువంటి గందరగోళం లేదా ఆందోళన అవసరం లేదని, వినియోగదారులు వారి విద్యుత్ బిల్లులలో ఎటువంటి అదనపు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. విద్యుత్ పంపిణీని ఆధునీకరించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా చేపట్టిన కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం (RDSS)లో భాగంగా స్మార్ట్ మీటర్లను ప్రవేశపెడుతున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లను అమలు చేయాలనే ప్రతిపాదనను AP విద్యుత్ నియంత్రణ కమిషన్ (APERC) ఫిబ్రవరి 2021లో ఆమోదించింది. ఈ ఆమోదం ఆధారంగా, APSPDCL ప్రభుత్వ, వాణిజ్య సేవలలో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడం ప్రారంభించింది.
స్మార్ట్ మీటర్ల విషయంలో ఆందోళన అవసరం లేదంటూ చెప్పిన కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఇక వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ఈ వీడియో ఒడిశాకు చెందిన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారని మేము గుర్తించాం.
KANAK న్యూస్ యూట్యూబ్ ఛానల్ లో "Outraged Residents Smash Meters In Bargarh: Allegation Of Exploitation Over Smart Meter Installation" అంటూ ఆగస్టు 17, 2024న వీడియోను పోస్టు చేశారు.
"ఒడిశాలోని బార్గఢ్లో నిరసనలో భాగంగా గ్రిడ్ కార్యాలయం వెలుపల గుమిగూడి కోపంతో స్మార్ట్ మీటర్లను పగలగొట్టారు. కొన్ని ఇళ్లలో ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్ల కారణంగా విద్యుత్ బిల్లులు పెరిగాయని చెబుతున్నారు. ఒక నివాసి కేవలం రెండు బల్బులకు ₹2000 చెల్లించినట్లు నివేదించారు." అంటూ వీడియో వివరణలో ఉంది.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో ఒడిశా రాష్ట్రానికి సంబంధించింది.
స్మార్ట్ మీటర్ల గురించి ఓ వైపు చర్చ జరుగుతూ ఉండగా, స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఏర్పాటు వల్ల వినియోగదారులపై అదనపు భారం పడదని ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL) స్పష్టం చేసింది. APSPDCL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె. సంతోష్ రావు మాట్లాడుతూ, స్మార్ట్ మీటర్ అమలుకు సంబంధించి ఎటువంటి గందరగోళం లేదా ఆందోళన అవసరం లేదని, వినియోగదారులు వారి విద్యుత్ బిల్లులలో ఎటువంటి అదనపు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. విద్యుత్ పంపిణీని ఆధునీకరించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా చేపట్టిన కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం (RDSS)లో భాగంగా స్మార్ట్ మీటర్లను ప్రవేశపెడుతున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లను అమలు చేయాలనే ప్రతిపాదనను AP విద్యుత్ నియంత్రణ కమిషన్ (APERC) ఫిబ్రవరి 2021లో ఆమోదించింది. ఈ ఆమోదం ఆధారంగా, APSPDCL ప్రభుత్వ, వాణిజ్య సేవలలో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడం ప్రారంభించింది.
స్మార్ట్ మీటర్ల విషయంలో ఆందోళన అవసరం లేదంటూ చెప్పిన కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఇక వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ఈ వీడియో ఒడిశాకు చెందిన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారని మేము గుర్తించాం.
KANAK న్యూస్ యూట్యూబ్ ఛానల్ లో "Outraged Residents Smash Meters In Bargarh: Allegation Of Exploitation Over Smart Meter Installation" అంటూ ఆగస్టు 17, 2024న వీడియోను పోస్టు చేశారు.
"ఒడిశాలోని బార్గఢ్లో నిరసనలో భాగంగా గ్రిడ్ కార్యాలయం వెలుపల గుమిగూడి కోపంతో స్మార్ట్ మీటర్లను పగలగొట్టారు. కొన్ని ఇళ్లలో ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్ల కారణంగా విద్యుత్ బిల్లులు పెరిగాయని చెబుతున్నారు. ఒక నివాసి కేవలం రెండు బల్బులకు ₹2000 చెల్లించినట్లు నివేదించారు." అంటూ వీడియో వివరణలో ఉంది.
వైరల్ వీడియోలోని విజువల్స్, ఈ విజువల్స్ ఒకటేనని మేము గుర్తించాం.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : ఒడిశాకు చెందిన విజువల్స్ ఇవి. అది కూడా గతంలో చోటు చేసుకున్న
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story

