Wed Dec 24 2025 10:57:06 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: హిమాలయాలలో -50 డిగ్రీల ఉష్ణోగ్రతలో సాధువు ధ్యానం చేస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు
హిమాలయాలలో -50 డిగ్రీల ఉష్ణోగ్రతలో సాధువు ధ్యానం చేస్తున్నట్లుగా

Claim :
హిమాలయాలలో -50 డిగ్రీల ఉష్ణోగ్రతలో సాధువు ధ్యానం చేస్తున్నారుFact :
వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు
పశ్చిమ హిమాలయ ప్రాంతం ప్రస్తుతం కరువు పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీర్ఘకాలం వర్షాలు లేకపోవడం, హిమపాతం పెద్దగా లేకపోవడంతో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఈ సీజన్లో మొట్టమొదటి సారిగా గణనీయమైన వర్షం, హిమపాతం అక్టోబర్ 6న సంభవించింది. అప్పటి నుండి పర్వత ప్రాంతాలలో వాతావరణ పరిస్థితులు ఎక్కువగా పొడిగా ఉన్నాయి. పశ్చిమ హిమాలయాలలోని పలు ప్రాంతాలు అసాధారణంగా ఉన్నాయి. శీతాకాలంలో సాధారణంగా మంచుతో కప్పబడి ఉండే ప్రాంతాలు ఇప్పుడు ఎంతో విభిన్నంగా కనిపిస్తున్నాయి.
ఈ ఆందోళనకరమైన పరిస్థితి వెనుక ఉన్న ముఖ్య కారకాల్లో ఒకటి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. ఇవి ఎక్కువ కాలం మంచు పర్వతాలపై ఉండనివ్వకుండా నిరోధిస్తున్నాయి. తరచుగా హిమపాతం సంభవించకపోవడంతో, కాలానుగుణ మంచు పేరుకుపోవడం లేదు. వాతావరణపరంగా, అక్టోబర్ మధ్య నాటికి పశ్చిమ హిమాలయాలను ప్రభావితం చేయడం ప్రారంభించి, నవంబర్లో వర్షం, హిమపాతం తెస్తుంది. సాధారణంగా, ఒకటి లేదా రెండు తీవ్రమైన పాశ్చాత్య అవాంతరాలు డిసెంబర్లో భారీ హిమపాతాన్ని అందిస్తాయి, వాటి ఫ్రీక్వెన్సీ మరింత పెరుగుతుంది. అయితే, ఈ సీజన్ లో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. నవంబర్, డిసెంబర్ మొదటి అర్ధభాగం దాదాపుగా ఎటువంటి ముఖ్యమైన వాతావరణ కార్యకలాపాలు లేకుండా గడిచిపోయాయి. 2024లో కూడా ఇలాంటి పొడి వాతావరణం కనిపించింది.
మంచుతో కప్పబడిన పర్వత శిఖరంపై ఒక సన్యాసి ధ్యానం చేస్తున్నట్లుగా చెబుతున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇది నిజమైన సంఘటన అని చెబుతూ పలువురు షేర్ చేస్తున్నారు. ఈ దృశ్యాలు ఒక కొండపై ధ్యాన భంగిమలో కూర్చున్న సన్యాసిని చూపిస్తున్నాయి. అతను తీవ్రమైన చలికి ఏ మాత్రం ప్రభావితం అవ్వలేదు. ఆయన శరీరం దాదాపు పూర్తిగా మంచుతో కప్పబడి ఉండగా, ఆయన ముఖం మాత్రమే కనిపిస్తూ ఉంది.
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన కీఫ్రేమ్లను తీసుకుని Google Lens ఉపయోగించి విశ్లేషించాము. అయితే అనేక సోషల్ మీడియా ఖాతాలు ఒకే వీడియోను ఇదే వాదనలతో పంచుకున్నాయి.
ఈ వీడియోకు మూలమైన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, ‘mrmahadevshorts1’ మాకు కనిపించింది. ఆ హ్యాండిల్ డిసెంబర్ 17, 2025న ఆ క్లిప్ను షేర్ చేసింది. ఖాతాను సమీక్షించిన తర్వాత అది తరచుగా AI-జనరేటెడ్ కంటెంట్ను పోస్ట్ చేస్తుందని తెలుసుకున్నాం.
వైరల్ అవుతున్న వీడియో, ఈ వీడియో ఒకటేనని మేము ధృవీకరించాం.
ఈ అకౌంట్ లో పలు వీడియోలను ఏఐ ద్వారా సృష్టించి అప్లోడ్ చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది.
ఈ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ AI-జనరేటెడ్ విజువల్స్ను షేర్ చేస్తూ ఉండడంతో వైరల్ వీడియోను AI-డిటెక్షన్ టూల్ హైవ్ మోడరేషన్ని ఉపయోగించి వైరల్ క్లిప్ను విశ్లేషించాం. అందుకు సంబంధించిన ఫలితాలు వీడియోలో AI-జనరేటెడ్ లేదా డీప్ఫేక్ కంటెంట్ఉందని సూచించింది.
మంచుతో నిండి ఉన్న పర్వత శిఖరంపై సాధువు ధ్యానం చేస్తున్నట్లు చూపించే వీడియో AI ద్వారా సృష్టించారు. వీక్షకులను తప్పుదారి పట్టించడానికి నిజమైన సంఘటనగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
Claim : హిమాలయాలలో -50 డిగ్రీల ఉష్ణోగ్రతలో సాధువు ధ్యానం
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story

