ఫ్యాక్ట్ చెక్: పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ, ఎంపీ రాహుల్ గాంధీ గొడవపడ్డారంటూ వైరల్ అవుతున్న ఫోటోను ఏఐ ద్వారా సృష్టించారు
పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ, ఎంపీ రాహుల్ గాంధీ గొడవ

Claim :
ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ పార్లమెంటు లోపల ఘర్షణకు దిగారుFact :
వైరల్ అవుతున్నది డిజిటల్ గా సృష్టించిన ఫోటో
ఢిల్లీలోని పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 2026లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రధాని రాజీపడ్డారు అని రాసిన పోస్టర్లతో కాంగ్రెస్ , ఇతర ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ మెట్లపై నిరసనకు దిగారు. అయితే లోక్సభలో 8 మంది ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్కు నిరసనగా ఈ ఆందోళన జరిగింది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం విషయంలో ప్రధాని మోదీ భారత రైతుల శ్రమను తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఇక పలువురు సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. స్పీకర్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభ ఆమోదం తెలిపింది. పార్లమెంట్ చరిత్రలో గత 22 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది.

