ఆ ఒక్క ప్రామిస్ కు రెండేళ్లకు పైగానే సమయమట
జగన్ తన ఎన్నికల ప్రచారంలో చెప్పినవన్నీ అమలు చేస్తున్నారు. మ్యానిఫేస్టోలో చెప్పిన అంశాలు మాత్రమే కాకుండా తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా అనేక హామీలు ఇచ్చారు. ఈ [more]
జగన్ తన ఎన్నికల ప్రచారంలో చెప్పినవన్నీ అమలు చేస్తున్నారు. మ్యానిఫేస్టోలో చెప్పిన అంశాలు మాత్రమే కాకుండా తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా అనేక హామీలు ఇచ్చారు. ఈ [more]
జగన్ తన ఎన్నికల ప్రచారంలో చెప్పినవన్నీ అమలు చేస్తున్నారు. మ్యానిఫేస్టోలో చెప్పిన అంశాలు మాత్రమే కాకుండా తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా అనేక హామీలు ఇచ్చారు. ఈ హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల సంఖ్య పెంచుతానని జగన్ మాట ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న పదమూడు జిల్లాలకు అదనంగా మరో 12 జల్లాలను ఏర్పాటు చేయాలన్నది జగన్ ఆలోచన. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేస్తానని ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రధానంగా ప్రస్తావించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుపై……
అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లా ఏర్పాట్లపై జగన్ దృష్టి సారించారు. కొన్ని జిల్లాల్లో భౌగోళికంగా ఇబ్బందులు ఎదురవుతాయని భావించి దానిపై సర్వేలు కూడా చేయించారు. ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించారు. ఏపీలో మరో పదమూడు జిల్లాలను కలిపితే మొత్తం 25 జిల్లాలు అవుతాయి. దీనికి సంబంధించిన ఫైళ్లు చక చకా నడిచాయి. కేంద్ర ప్రభుత్వానికి కూడా జిల్లాల పెంపు ప్రతిపాదనను జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడు తెలిపారు. జిల్లాల పెంపునకు సంబంధించిన ఫైళ్లను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపారు.
కసరత్తు పూర్తి చేసినా …..
కొత్త జిల్లాలుగా అనకాపల్లి, అరకు, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, విజయవాడ, నరసరావుపేట, బాపట్ల, తిరుపతి, , రాజంపేట, నంద్యాల, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాలు జిల్లా కేంద్రాలుగా మారనున్నాయి. దీనిపై పూర్తి స్థాయి కసరత్తును కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. త్వరగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి అభివృద్ధిని ప్రజలకు మరింత చేరువచేయాలని సూచించారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్పీఆర్ (npr) పూర్తయిన తర్వాతనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకోవాలని జగన్ కు అప్పట్లో సూచిచింది.
అది పూర్తయిన తర్వాతే?
అన్నీ సజావుగా జరిగితే జాతీయ పౌర పట్టిక వచ్చే ఏడాది మార్చి 31వ తేదీకి పూర్తి కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఇప్పుడు జాతీయ పౌర పట్టిక జరగడం లేదు. కరోనా వ్యాధి పూర్తి స్థాయిలో తగ్గిన తర్వాతనే ఇది మొదలయ్యే అవకాశం ఉంది. దీంతో జాతీయ పౌర పట్టిక మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. అంటే మరో ఆరు నెలలు సమయం పట్టే అవకాశముందని చెబుతున్నారు. అంటే జగన్ అనుకున్నట్లు 2021లోనూ కొత్త జిల్లాల ఏర్పాటు జరిగే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తోంది. జగన్ హామీ అమలు కావడానికి రెండేళ్లు పట్టే అవకాశముంది. అన్నీ సజావుగా జరిగితేనే?