జగన్ ని చూసి పెట్టుబడులు వస్తాయా
జగన్ అమెరికాలోని ప్రవాస భారతీయులను ఏపీలో పెట్టుబడులు పెట్టమంటున్నారు. అన్నీ తాను స్వయంగా దగ్గరుండి మరీ చూసుకుంటానని కూడా చెబుతున్నారు. ఒక్క దరఖాస్తు మీది కాదనుకుని పడేస్తే [more]
జగన్ అమెరికాలోని ప్రవాస భారతీయులను ఏపీలో పెట్టుబడులు పెట్టమంటున్నారు. అన్నీ తాను స్వయంగా దగ్గరుండి మరీ చూసుకుంటానని కూడా చెబుతున్నారు. ఒక్క దరఖాస్తు మీది కాదనుకుని పడేస్తే [more]
జగన్ అమెరికాలోని ప్రవాస భారతీయులను ఏపీలో పెట్టుబడులు పెట్టమంటున్నారు. అన్నీ తాను స్వయంగా దగ్గరుండి మరీ చూసుకుంటానని కూడా చెబుతున్నారు. ఒక్క దరఖాస్తు మీది కాదనుకుని పడేస్తే చాలు మిగిలిన కధ నేనే నడిపిస్తానని భరోసా ఇస్తున్నారు. ప్రత్యేకంగా ప్రవాసాంధ్రుల కోసం, పెట్టుబడిదారుల కోసం ప్రభుత్వ పోర్టల్ ని కూడా ఏపీలో ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇస్తున్నారు. ఏపీలో తొమ్మిది వందల కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఉంది. సహజ వనరులు ఉన్నాయి. ప్రభుత్వ సహకారం ఉంది అని జగన్ చాలానే చెబుతున్నారు. ఇవన్నీ విన్నపుడు ఇవే మాటలు ఇంతకు ముందు కూడా చంద్రబాబు నుంచి విన్నామని అనిపించకమానదు.
ఏపీలో ఏముంది?
అసలు ఏపీలో ఏముంది అన్నది ఇపుడు అందరికీ తెలియాల్సిన విషయం. ఏపీలో ఏమీ లేదన్నది కూడా అందరికీ తెలిసిన విషయం. విభజన అడ్డగోలుగా జరిగింది. అరవయ్యేళ్ళు కష్టపడి అంతా ఏరికూర్చిన హైదరాబాద్ రాజధాని తెలంగాణాకు వెళ్ళిపోయింది. విశాఖపట్నం తప్ప పెద్ద సిటీ లేని పదమూడు జిల్లాల నవ్యాంధ్ర మాత్రమే ఏపీలో ఉంది. ఇలా కళ్ళకు అంతా కనిపిస్తూంటే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారా అన్నది పెద్ద చర్చగా ఉంది. చంద్రబాబు అయిదేళ్ల పాలనలో గొప్ప కబుర్లు ఎన్నో చెప్పి జనాన్ని బురిడీ కొట్టించారు తప్ప ఏపీకి పెద్దగా వచ్చిన పరిశ్రమలైతే లేవు. ఎందుకంటే ఏపీ ఇంకా ఇల్లు అలుక్కోలేదు, పండుగ ఎపుడు రావాలి. ఈలోగా వచ్చి పనులు చేయమంటే చుట్టాలు అసలు చేయరు. పారిశ్రామికవేత్తలు కూడా అలాగే ఆలోచిస్తారు.
రాజకీయంగా కూడా….
ఇక ఏపీలో చూసుకుంటే రాజకీయంగా కూడా ఇబ్బందులు చాలా ఉన్నాయి. చంద్రబాబు సీఎం గా ఉంటే జగన్ ఆయన్ని ఎదిరించి నిలిచారు. అప్పట్లో అదో రకమైన ఘర్షణ వాతావరణం. ఇపుడు జగన్ సీఎం అయ్యాక బాబు కూడా అదే చేస్తున్నారు. రాజకీయంగా కలసిరాని పార్టీలు ఇక్కడ ఉన్నాయి. దాంతో పారిశ్రామికవేత్తలకు కావాల్సిన శాంతియుతమైన వాతావరణం ఏపీలో లేదన్న బెంగ చాలా మందిలో ఉంది. అంతే కాదు, కేంద్ర ప్రభుత్వం తీరు కూడా దగ్గరుండి మరీ చూస్తున్న పారిశ్రామికవేత్తలు ఏపీని నడి సముద్రంలో వదిలేసే వైఖరినే గమనిస్తున్నారు.
ఖజానా ఖాళీగా….
మరో వైపు ప్రభుత్వ హామీలు కోటలు దాటుతున్నా ఏపీ ఖజానా మాత్రం ఖాళీగా వెక్కిరిస్తోంది. అందువల్ల ఇచ్చిన మాట మేరకు ఎంత వరకూ రాయితీలు ఇవ్వగలరన్న సందేహం కూడా పారిశ్రామికవేత్తల్లో ఉంది. ఏపీ ముందుగా బాగుపడితేనే తప్ప పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ రారన్నది నిజం. మరి బాగుపడాలంటే పరిశ్రమలు రావాలి అంటారు. ఇది ఎప్పటికీ తెగని సమస్య. అయితే దీనికి ఒక సులువు వుంది. ముఖ్యమంత్రి జగన్ ఎలాగూ పారిశ్రామికవేత్త కాబట్టి, తనవారు అనుకున్న వారి చేత ముందుగా పరిశ్రమలు పెట్టిస్తే మిగిలిన వారు కూడా మెల్లగా ధైర్యం చేస్తారు. ఆ పని జగన్ తన పార్టీ నుంచి, తన మిత్రుల నుంచి మొదలుపెడితే ఏపీలో పారిశ్రామిక కళ కాస్తైనా కనిపిస్తుందేమో చూడాలి.