ఇప్పటికి జగన్ చేయగలిగింది ఇంతేనా ?
జగన్ పదేళ్ళ పాటు ఆలోచించింది, ఇపుడు అధికారం అందుకున్నాక పాలన చేస్తున్నదీ ఒక్కటేనా. ఈ మాత్రం దానికి వాళ్ళనూ వీళ్ళనూ తిట్టడం ఎందుకు అన్న మాట ఓవైపు [more]
జగన్ పదేళ్ళ పాటు ఆలోచించింది, ఇపుడు అధికారం అందుకున్నాక పాలన చేస్తున్నదీ ఒక్కటేనా. ఈ మాత్రం దానికి వాళ్ళనూ వీళ్ళనూ తిట్టడం ఎందుకు అన్న మాట ఓవైపు [more]
జగన్ పదేళ్ళ పాటు ఆలోచించింది, ఇపుడు అధికారం అందుకున్నాక పాలన చేస్తున్నదీ ఒక్కటేనా. ఈ మాత్రం దానికి వాళ్ళనూ వీళ్ళనూ తిట్టడం ఎందుకు అన్న మాట ఓవైపు నుంచి వినిపిస్తున్న వేళ ఇంతకీ జగన్ ఏడాదిన్నరగా ఏం చేశారో ఒక్కసారి చూడాల్సిందే. జగన్ వస్తే భారీగా మార్పు వస్తుందని సగటు జనం సైతం హైలెవెల్లో ఊహించేసుకుని మరీ పట్టం కట్టారు. మంచి తరుణం మించిన దొరకదు, జగన్ కి ఓటేయని ఎన్నికలు వృధా అన్నట్లుగా 2019 ఎన్నికల వేళ తెగ హడావుడి చేశారు. తెల్లారుతూనే భారీ ఎత్తున క్యూలు కట్టి మరీ అర్ధరాత్రి దాకా నిలిచి ఏపీ ప్రజలు ఓట్లేశారు. 151 సీట్లతో జగన్ని తెచ్చి గద్దె మీద కూర్చోబెట్టారు.
అంతవరకూ ఓకే …..
ఇక జగన్ కూడా తనను ఆదరించిన జనాల రుణం తీర్చుకునేందుకు డే వన్ నుంచే కార్యాచరణ మొదలుపెట్టారు. తాను కురిపించిన హామీల వరదను పేద వాడి ముంగిట చేర్చేందుకు గత ఏడాదిన్నరగా చేయని ప్రయత్నం లేదు. అందులో జగన్ పూర్తిగా సక్సెస్ కూడా అయ్యారు. ఈ దేశంలో ఈ కాలంలో ఏ రాజకీయ నేత చేయని విధంగా ఇచ్చిన హామీలను జగన్ అమలుచేశారు. ఆ మేరకు ఆయనకు పేరు కూడా వచ్చింది. అయితే జగన్ ప్రవచితమైన అద్భుతమైన పరిపాలన అంటే ఇంతేనా. ఇంతకు మించి లేదా. ఉండదా అన్న సందేహాలు అందరిలో కలుగుతున్నాయి.
అప్పులతో అలా….
సంక్షేమ రాజ్యం అని చెప్పుకోవడానికి జగన్ తాపత్రయపడుతున్నారు. అందుకోసం అప్పులు తెచ్చి మరీ వాటిని కొనసాగిస్తున్నారు. ఓ వైపు కాగ్ సైతం ఏపీలో అప్పుల మీద ఆందోళన వ్యక్తం చేసింది. తెచ్చిన అప్పులతో ఇలా పధకాల పేరిట ఖర్చు చేయడాన్ని తప్పు పట్టింది. ఇదే తీరున చేసుకుంటూ పోతే రేపటి రోజున ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయమని కూడా కాగ్ హెచ్చిరిస్తోంది. ఇక మరో వైపు ఏపీ ఆదాయానికీ, ఖర్చులకు అసలు పొంతన లేకపోవడాన్ని కూడా కాగ్ ఆక్షేపించడం విశేషం. ఇక బడ్జెట్ లో పేర్కొన్న దానికి కేటాయింపులకూ కూడా ఆమడదూరం ఉందని కూడా వేలెత్తి చూపడం గమనార్హం.
వైఎస్సార్ స్పూర్తి అలా….
జగన్ కి ఆయన తండ్రి వైఎస్సార్ ఆదర్శం. రాజకీయంగా గురువు కూడా ఆయనే. అయితే ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ ఏ పధకం అయినా సులువుగా చేయగలిగే వీలుంది. పైగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఖజానాకు ఎనభై శాతం నిధులను తెచ్చి పెట్టే బంగారం లాంటి హైదరాబాద్ రాజధానిగా నాడు ఉంది. జగన్ తన తండ్రిని స్పూరిగా తీసుకుని వేసిన అడుగులు రాజకీయంగా హిట్ అయినా పాలనాపరంగా మాత్రం ఫ్లాప్ అవుతున్నాయి. దానికి మరో ప్రధాన కారణం విభజన ఏపీకి జగన్ మలి సీఎం కావడమే. ఇక చంద్రబాబు తొలి సీఎం గా ఉన్నపాటి ఆర్ధిక వనరులను వాడేసి పోయారు. కేంద్ర పెద్దల విశ్వాసాన్ని కూడా నాటి పాలకులు వమ్ము చేశారు.
ఇదే ఎక్కువేమోనా…?
ఇలా అన్ని వైపుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్న వేళ జగన్ సీఎం కావడం విధి విచిత్రంగా చూడాలి. జగన్ బ్రహ్మాండమైన మార్పు తెస్తారని ఆశించిన వారికి జగన్ అభివృద్ధి పరంగా కానీ మరే విధంగా కానీ చేయలేకపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. కానీ జగన్ కాని కాలంలో సీఎం అయ్యారు. అందుకే తమ ఇమేజ్ మొత్తం ఫణంగా పెట్టినా కూడా ఏపీ రధాన్ని ప్రగతి దారిన నడిపించలేకపోతున్నారు. గట్టిగా రెండవ ఏడు కూడా నిండని జగన్ ఏలుబడిలో ఇప్పటికి జరిగిందే ఎక్కువ అనుకోవాలి. రానున్న గడ్డు రోజులను తలచుకుంటే జగన్ ఇంతకంటే కూడా ఎక్కువగా ఏదైనా చేయగలడా అని డౌట్లు కూడా వస్తున్నాయి.