Whatsapp Image Scam: వాట్సాప్ లో సరికొత్త స్కామ్.. ఆ ఫోటోలు డౌన్ లోడ్ చేయగానే అకౌంట్లు ఖాళీ !
డిజిటల్ మోసాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి, దీనివల్ల వ్యక్తులు భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు. సాంకేతికత

డిజిటల్ మోసాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి, దీనివల్ల వ్యక్తులు భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ, మోసగాళ్లు వివిధ మార్గాలలో- ఇమెయిల్స్, టెక్స్ట్ మెసేజ్లు, సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా — వినియోగదారులను మోసం చేస్తూ ఎక్కువ మొత్తంలో డబ్బును దోచుకుంటున్నారు. ఎప్పటికప్పుడు సైబర్ నేరస్థులు వినియోగదారులను దోపిడీ చేయడానికి నిరంతరం కొత్త మార్గాలను కనుగొంటున్నారు. కొత్తగా, ఇమేజ్ ఫైల్స్లో హానికరమైన కోడ్ పొందుపరిచి డబ్బు దోచుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు.
తాజాగా మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన ఓ వ్యక్తి అపరిచిత నంబర్ నుంచి వాట్సాప్లో వచ్చిన ఫోటోను డౌన్లోడ్ చేయగానే, ఆయన ఖాతా నుంచి దాదాపు రూ.2లక్షలు మాయమయ్యాయని పోలీసులు వెల్లడించారు. దీంతో ఈ మోసాల గురించి టెలికాం శాఖ, అలాగే, పోలీసు శాఖ అధికారికంగా హెచ్చరికలు జారీ చేసింది. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేయవద్దని సూచించారు.
Whatsapp ఇమేజ్ స్కామ్ అంటే ఏమిటి?
ఈ కొత్త మోసానికి కేంద్రబిందువు **స్టెగనోగ్రఫీ** అనే టెక్నిక్. ఇది హ్యాకర్లు ఫోటోలో మాల్వేర్ను దాచేందుకు ఉపయోగిస్తారు. ఫోటోను డౌన్లోడ్ చేసిన వెంటనే, వైరస్ యాక్టివేట్ అవుతుంది. దాంతో మోసగాళ్లు ఫోన్ను, యాప్స్ను, యూజర్ వ్యక్తిగత సమాచారాన్ని — ఊఫీ ఈడ్, పాస్వర్డ్ లు, బ్యాంక్ వివరాలు, సోషల్ మీడియా అకౌంట్లు, ఓటీపీ లు మొదలైనవి — పూర్వాపరాలా ఆక్రమిస్తారు.
ఇది ఇతర మోసాలతో భిన్నంగా ఉంటుంది. స్టెగనోగ్రఫీ స్కామ్లో, ఓటీపీ లు వంటి ఎలాంటి హెచ్చరికలు రావు — కేవలం ఓ సాధారణ వాట్సాప్ ఫోటో మాత్రమే వస్తుంది.
స్కామర్లు మొదటగా వాట్సాప్ లేదా ఇతర మెసేజింగ్ ప్లాట్ఫామ్ ద్వారా ఫోటోలను పంపడం ద్వారా వారి మాయాజాలాన్ని ప్రారంభిస్తారు. కొన్ని సందర్భాల్లో, "ఫోటోలోని వ్యక్తిని గుర్తించగలరా?"అని అడుగుతూ ఫోన్ కాల్స్ కూడా చేస్తారు. బాధితుడు ఆ ఫోటోను డౌన్లోడ్ చేసిన వెంటనే, ఫోన్ పనిచేయకుండా పోతుంది.దాంతోపాటు స్కామర్లకు ఆ ఫోన్ను యాక్సెస్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. దీనిని ‘స్టెగానోగ్రఫీ’ అంటారు.
సైబర్ నిపుణుల ప్రకారం, ఇవాళ ఫేక్ లింకులు, ఓటీపీ స్కామ్లను మించిపోయి, స్టెగానోగ్రఫీ ద్వారా స్కామర్లు మరింత ప్రమాదకరంగా మారుతున్నారని చెబుతున్నారు. ప్రఖ్యాత సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పెర్స్కీ (Kaspersky) తెలిపిన వివరాల ప్రకారం, స్టెగానోగ్రఫీ అనేది సమాచారం దాచుకునే ఒక నూతన టెక్నిక్. ఈ టెక్నాలజీ ద్వారా మెసేజ్, ఫోటో, వీడియో లేదా ఆడియో వంటి డిజిటల్ ఫైళ్లలో దాగిన సమాచారం లభించకుండా చేస్తారు.
ఒక ఇమేజ్ సాధారణంగా ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులకు అనుగుణంగా మూడు బైట్ల డేటాను కలిగి ఉంటుంది. దాచిన డేటా తరచుగా నాలుగో బైట్లో పొందుపరుస్తారు. దీనిని ‘ఆల్ఫా’ ఛానల్ అని కూడా పిలుస్తారు. బాధితుడు ఆ వైరస్ సోకిన చిత్రాన్ని తెరిచిన తర్వాత ఆ మాల్వేర్ వారి పరికరంలో ఆటోమెటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. ఈ మాల్వేర్ బ్యాంకింగ్ వివరాలు, పాస్వర్డులు వంటి సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేస్తుంది.
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పరికరానికి రిమోట్ యాక్సెస్ను కూడా అనుమతిస్తుంది. బాధితుడు ప్రారంభంలో చిత్రాన్ని విస్మరిస్తే, స్కామర్లు ఫైల్ను తెరవమని ఒత్తిడి చేయడానికి కాల్తో ఫాలో అప్ చేయవచ్చు. ఇటీవలి జబల్పూర్ కేసులో ఒక వ్యక్తికి తెలియని నంబర్ నుంచి ఫోటో వచ్చింది. ఆ ఫొటోలోని వ్యక్తిని గుర్తించాలని వాట్సాప్ కాల్ వచ్చింది. మొదట్లో ఆ సందేశాన్ని పట్టించుకోలేదు. క్రమేపి పదే పదే కాల్స్ చేసిన తర్వాత బాధితుడు ఇమేజ్పై క్లిక్ చేశాడు. దీంతో అతని బ్యాంక్ ఖాతా నుంచి సుమారు రూ.2 లక్షలు విత్డ్రా అయ్యాయి.
ఈ విధమైన హ్యాకింగ్ పద్ధతి వాట్సాప్ వినియోగదారుల్లో ఆందోళనను పెంచుతోంది, ఎందుకంటే ఈ స్కామర్లను ట్రాక్ చేయడం చాలా కష్టం అవుతోంది.
Whatsapp ఫోటో స్కామ్ నుండి ఎలా జాగ్రత్త పడాలి?
- గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చిన ఫోటోలు, వీడియోలు డౌన్లోడ్ చేయవద్దు.
- ఎలాంటి లింక్ అయినా క్లిక్ చేయవద్దు. వాట్సాప్, ఎస్ఎంఎస్, ఇతర మెసేజ్ ప్లాట్ఫామ్స్ ద్వారా వచ్చినవైనా సరే.
- వాట్సాప్ సెట్టింగ్స్లో “Media Auto Download” ఆపేయండి.
- మీ ఫోన్ సాఫ్ట్వేర్, యాంటీవైరస్ అప్డేట్ చేయడం తప్పనిసరి.
- ఏదైనా మోసం జరిగినట్టు అనిపించిన వెంటనే, సైబర్ క్రైమ్కు 1930 నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి.