వెలగపూడి రాజకీయానికి ఎండ్ కార్డ్ ?
విశాఖ జిల్లాలో వ్యాపారం చేసుకుందామని వచ్చి మూడు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన అద్రుష్టవంతుడు టీడీపీకి చెందిన వెలగపూడి రామకృష్ణ బాబు. ఆయన విశాఖ తూర్పు నుంచి ముచ్చటగా [more]
విశాఖ జిల్లాలో వ్యాపారం చేసుకుందామని వచ్చి మూడు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన అద్రుష్టవంతుడు టీడీపీకి చెందిన వెలగపూడి రామకృష్ణ బాబు. ఆయన విశాఖ తూర్పు నుంచి ముచ్చటగా [more]
విశాఖ జిల్లాలో వ్యాపారం చేసుకుందామని వచ్చి మూడు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన అద్రుష్టవంతుడు టీడీపీకి చెందిన వెలగపూడి రామకృష్ణ బాబు. ఆయన విశాఖ తూర్పు నుంచి ముచ్చటగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అందులో రెండు సార్లు విపక్ష ఎమ్మెల్యేగా ఉండడం ఆయనకు కొంత ఇబ్బందికరంగా ఉంది. ఇదిలా ఉండగా 2019 ఎన్నికల్లో జగన్ గాలి వీచినా కూడా గెలిచిన అతి కొద్ది మంది ఎమ్మెల్యేలలో వెలగపూడి రామకృష్ణ ఒకరు. ఆయనకు లక్కు అలా కలసివచ్చిందని చెప్పాలి. విశాఖ తూర్పు నియోజకవరం వైసీపీలో ఉన్న వర్గ పోరు వెలగపూడి రామకృష్ణ పాలిట వరంగా మారి గెలిచేశారు. ఆయనకు వైసీపీ ఎంపీ క్యాండిడేట్. ఒక కీలక నేత సాయం చేయడంతో తూర్పులో రాజకీయ మార్పు లేకుండా పోయిందంటారు.
బిగించేస్తున్నారా…?
ఇపుడు మాత్రం ఆయనకు తూర్పు రాజకీయం రాచబాట కాదు అంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలను ఓడించాలని జగన్ పక్కా ప్లాన్ ని సిద్ధం చేసి ఉంచారు. అందులో భాగంగా వెలగపూడి రామకృష్ణ ని టార్గెట్ చేశారు. విశాఖను పాలనారాజధానిగా ప్రకటించిన నేపధ్యంలో ఆ ప్రభావం సిటీ ఎమ్మెల్యేలు అందరి మీద ఉంది. వెలగపూడి రామకృష్ణ జగన్ని వ్యక్తిగతంగా దూషించారు అని పోలీస్ కేసులు కూడా ఉన్నాయి. ఇక ఆయన జై అమరావతి అంటూ అసెంబ్లీలో నినదించారు. దాంతో ఆయన్ని నాన్ లోకల్ గా జనంలో పెట్టి విశాఖ వ్యతిరేకి గా ముద్ర వేస్తోంది వైసీపీ. ఇక ఆయన మద్యం వ్యాపారానికి వైసీపీ సర్కార్ విధానాల వల్ల పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంతో ఆర్ధికంగా దెబ్బ పడుతోంది.
కూడగడుతున్నారుగా ….?
నిజానికి తూర్పు నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో యాదవులు ఉన్నారు. కానీ వారు ఇప్పటికి ఒక్కసారి కూడా గెలవలేదు. దానికి కారణం వారిలో అనైక్యత ఉండడమే. వైసీపీ నేతగా ఉన్న వంశీక్రిష్ణ శ్రీనివాస్ తూర్పు నియోజకవర్గం మీద సరిగ్గా దృష్టి పెట్టలేదు అన్న విమర్శలు ఉన్నాయి. దానికి తోడు ఆయన వ్యాపారాల్లో పడి రాజకీయన్ని నిర్లక్ష్యం చేశారు. ఇపుడు ఆయన్ని తప్పించి అక్రమాన విజయనిర్మలను వైసీపీ ఇంచార్జిగా చేసింది. ఆమెను 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విశాఖ తెచ్చి టికెట్ ఇవ్వడంతో వంశీ వర్గం సహకరించలేదు. దాంతో ఆమె ఓడిపోయారు. కానీ ఓడిన నాటి నుంచి తూర్పులోనే నివాసం ఏర్పాటు చేసుకుని పార్టీని బలోపేతం చేస్తున్నారు. అన్నిటికంటే ముందుగా యాదవులకు ఒక్కటిగా చేస్తున్నారు. రేపటి ఎన్నికల్లో అదే వైసీపీకి బలంగా మారబోతోంది.
మైనస్ అవుతుందా…?
వెలగపూడి రామకృష్ణ ఇంతకాలం మత్య్సకారులు, యదవుల మద్దతుతో ఎమ్మెల్యేగా చక్రం తిప్పారు. కానీ ఇపుడు గట్టి అభ్యర్ధిగా విజయనిర్మల ఉన్నారు. పైగా ఆయన మీద కూడా భూదందా ఆరోపణలు ఉన్నాయి. ఇక తూర్పుని పూర్తిగా తీసుకుంటే కమ్మ సామాజికవర్గం కనీసం వన్ పర్సెంట్ కూడా ఉండరు, అదే ఆయనకు మైనస్ గా మారనుంది. పైగా ఆయన మూడు మార్లు ఎమ్మెల్యే అన్న మాటే కానీ కచ్చితంగా ఫలనా పని చేశాను అని జనాలకు చెప్పలేని స్థితి ఉంది. దాంతో ఇవన్నీ 2024 ఎన్నికల్లో బాగానే పనిచేసేలా ఉన్నాయి. వెలగపూడి రామకృష్ణ కి సొంత పార్టీలో కూడా అసమ్మతి పెరిగింది. ఆయన ఒక వర్గం నేతగా వ్యవహరిస్తున్నారని కూడా కామెంట్స్ ఉన్నాయి. అయినా సరే 2024లో చంద్రబాబు ఆయనకే టికెట్ ఇస్తారు. కానీ ఈసారి గెలవడం కష్టమని ఇప్పటి నుంచే వినిపిస్తున్న మాట. తూర్పు మార్పు కోరుకుంటే వెలగపూడి రామకృష్ణ రాజకీయానికి డెడ్ ఎండ్ కార్డ్ పడుతుంది అంటున్నారు. మొత్తానికి విజయనిర్మల ఈసారి ఎమ్మెల్యే అని వైసీపీలో నమ్మకంగా వినిపిస్తున్న మాట. చూడాలి మరి ఏం జరుగుతుందో.