జగన్ కేసులపై ఉండవల్లి విశ్లేషణ
జగన్ ని ఎవరూ ఏమీ చేయలేరా? జగన్ ఎవరికీ భయపడాల్సింది లేదా? జగన్ కి సాటీ, పోటీ అంటూ ఎవరూ లేనే లేరా? అంటే అవును అనే [more]
జగన్ ని ఎవరూ ఏమీ చేయలేరా? జగన్ ఎవరికీ భయపడాల్సింది లేదా? జగన్ కి సాటీ, పోటీ అంటూ ఎవరూ లేనే లేరా? అంటే అవును అనే [more]
జగన్ ని ఎవరూ ఏమీ చేయలేరా? జగన్ ఎవరికీ భయపడాల్సింది లేదా? జగన్ కి సాటీ, పోటీ అంటూ ఎవరూ లేనే లేరా? అంటే అవును అనే అంటున్నారు వైఎస్సార్ ప్రియ మిత్రుడు ఉండవల్లి అరుణ్ కుమార్. జగన్ ని దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా ఆయన అభివర్ణిస్తున్నారు. ఆయన మీద కేసుల బూచి చూపించి కేంద్రం కూడా లొంగదీసుకోలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు. జగన్ ని అరెస్ట్ చేసే ప్రయత్నం కేంద్రం ఎపుడూ చేయదని కూడా ఆయన అంటున్నారు. జగన్ బలమైన రాజకీయ శక్తి అని కేంద్రంలోని ప్రభుత్వాన్ని నడిపేవారికి కూడా తెలుసు అని ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు.
కొత్త కాదు…..
జగన్ పదహారు నెలలు జైల్లో గడిపి వచ్చిన వారు. ఆయనకు పదేళ్ళుగా కేసుల బాధ ఉంది. జైలు జీవితమూ కొత్త కాదు, జగన్ ని బ్లాక్ మెయిల్ చేయడం అంటే కేంద్ర పెద్దలకు కూడా కుదిరే పని కానే కాదని ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషిస్తున్నారు. జగన్ కేసుల విషయంలో కేంద్రం కూడా కొత్తగా ఏం చేయగలిగిందీ లేదని తేల్చేశారు. జగన్ కేసులు కోర్టుల్లో ఉన్నాయని, తీర్పులు కూడా అక్కడే వస్తాయని ఆయన అభిప్రాయపడుతున్నారు.
ఆ సవాల్ …..
జగన్ కేంద్రాన్ని ప్రత్యేక హోదా విషయంలో గట్టిగా నిలదీయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ కోరుతున్నారు. ప్రత్యేక హోదా అని జగన్ అడిగితే కేసులను కేంద్రం తిరగతోడుతుందని విపక్షాలు చేస్తున్న ప్రచారం తప్పు అని ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు. మోడీ ప్రధాని కాక ముందే ఉన్న కేసులను ఆయన ఏమీ చేయలేరని కూడా చెబుతున్నారు. జగన్ డేరింగ్ గా ప్రత్యేక హోదా ఇస్తారా లేక నన్ను జైలుకు పంపుతారా అని కేంద్రాన్ని నిలదీస్తే తప్పకుండా హోదా విషయంలో వారు ఆలోచిస్తారని, జగన్ అంటే ఎవరో కూడా కేంద్రానికి అలా మరోసారు తెలుస్తుందని ఉండవల్లి అరుణ్ కుమార్ సూచిస్తున్నారు.
అది చేస్తే ఓకేనా?
జగన్ ఏపీ ప్రజలకు సంక్షేమ పధకాల పేరిట పప్పు బెల్లాలుగా అన్నీ పంచుతున్నారనని ఉండవల్లి అరుణ్ కుమార్ కొన్ని హార్ష్ కామెంట్స్ చేశారు. గత సీఎం అమరావతి అంటూ ఖజానాను ఉన్నదంతా అక్కడ ఖర్చు పెట్టారని, ఇక సీఎం జగన్ అడిగినవీ, అడగనివీ కూడా ఇస్తూ జనాలకు పెద్ద సేవ చేస్తున్నారని సెటైర్లు విసిరారు. జగన్ ముందు అర్జంటుగా చేయాల్సింది పోలవరం విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చెయడం అని ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. ఇది మొత్తం ఏపీ ప్రజల కోరికని ఆయన అన్నారు. ఆ ప్రాజెక్ట్ కనుక పూర్తి చేస్తే జగన్ కి తిరుగు ఉండదనికూడా ఆయన అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే జగన్ ఏం చేయాలో, చేయకూడదో ఓ మంచి సలహాదారునిగా ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు అనుకోవాలి.