బొబ్బిలి రాజులకు లైన్ క్లియర్ ..?
బొబ్బిలి యుధ్ధం సినిమా గురించి చూస్తే బొబ్బిలి రాజుల పౌరుషం గురించి కూడా తెలుస్తుంది. నాటి యుద్ధంలో వాడిన కత్తులు కూడా బొబ్బిలి కోటలో ఇప్పటికీ పదిలంగా [more]
బొబ్బిలి యుధ్ధం సినిమా గురించి చూస్తే బొబ్బిలి రాజుల పౌరుషం గురించి కూడా తెలుస్తుంది. నాటి యుద్ధంలో వాడిన కత్తులు కూడా బొబ్బిలి కోటలో ఇప్పటికీ పదిలంగా [more]
బొబ్బిలి యుధ్ధం సినిమా గురించి చూస్తే బొబ్బిలి రాజుల పౌరుషం గురించి కూడా తెలుస్తుంది. నాటి యుద్ధంలో వాడిన కత్తులు కూడా బొబ్బిలి కోటలో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. రాచరికం అంతరించినా వారిలో పౌరుషాలు ఎక్కడా తగ్గలేదు. అదే రాజసం. అదే రాజనీతి వారితోనే అంటిపెట్టుకుంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు వంశీకులు కూడా రాజకీయాల్లో రాటుదేలిన వారే. ఇక 2004లో రాజకీయ అరంగేట్రం చేసిన సుజయ కృష్ణ రంగారావు కాంగ్రెస్ నుంచి రెండు సార్లు, వైసీపీ నుంచి ఒకసారి గెలిచారు. ఆయన టీడీపీలో చేరి మంత్రి గా రెండేళ్ళు ఉన్నా కూడా బొబ్బిలి ప్రజలు మాత్రం ఆయన తీరుని మెచ్చలేదు. అందుకే ఘోరంగా 2019 ఎన్నికల్లో ఓడించారు. అక్కడ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత వైసీపీ అంటేనే ఎక్కువ అభిమానం. అలా రాంగ్ స్టెప్ తో ఆయన రాజకీయంగా కొంతకాలంగా ఇబ్బందులు పడుతూ వచ్చారు.
వదిలేసారుగా ….
టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో ఒక మాట ఉంది. ఆయనది యూజ్ అండ్ త్రో పాలసీ అని. అందుకే ఆయన జగన్ ని దెబ్బకొట్టడానికి అన్నట్లుగా బొబ్బిలి రాజుల చేత బలవంతంగా టీడీపీలోకి గ్రుహ ప్రవేశం చేయించారు. అయితే ఎన్నికల తరువాత వారి అవసరం తీరిపోయింది అన్నట్లుగా పట్టించుకోలేదని అంటారు. ఇపుడు విజయనగరం జిల్లాలో రాజులు అంటే బాబుకు ఎందుకో ఒక్కసారిగా మోజు తగ్గిందని అంటున్నారు. బీసీల జపంతో తరిస్తున్న బాబు ఈ ఓసీ వెలమ రాజు సుజయ కృష్ణ రంగారావు ని పక్కన పెట్టేశారని కూడా అంటున్నారు. ఆయన కుటుంబానికి పార్టీపరంగా కూడా పెద్దగా గుర్తింపు ఇవ్వలేదని చెబుతున్నారు.
దారి చూపించారా ?
చంద్రబాబు రాజకీయ చాణక్యం సంగతేంటో కానీ సీనియర్ నేతలను అది పరాభవంగా మారింది. బొబ్బిలి రాజులుగా ఒకనాడు జిల్లాలో చక్రం తిప్పిన సుజయ సోదరులను పసుపు పార్టీ ఏమీ కానట్లుగా ఎడంగా నెట్టేసిందని అంటున్నారు. ఈ పరిణామంతో బొబ్బిలి రాజ వంశీకులలో హాట్ హాట్ చర్చ సాగుతోందిట. ఇక ఎన్నికల్లో ఓడిన తరువాత సుజయ కృష్ణ రంగారావు కొన్నాళ్ళ పాటు హడావుడి చేసినా కూడా ఆ తరువాత నుంచి మౌనమే నా మాట అంటున్నారు. ఇక ఆయన మకాం కూడా విశాఖలోనే ఉంది. ఆయన ఎపుడో కానీ బొబ్బిలి రారు అన్న ప్రచారం కూడా ఉంది. దీంతో ఆయన విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే అన్నట్లుగా బాబు ఒక దారి చూపించేశారని అంటున్నారు.
వైసీపీలోకేనా…?
ఇవన్నీ ఇలా ఉంటే చాలా కాలంగా వినిపిస్తున్న ఒక మాట సుజయ కృష్ణ రంగారావు తిరిగి తన మాతృ సంస్థ వైసీపీలోకి వస్తారని. జగన్ కి కూడా ఆయన మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇక ఆయన కూడా టీడీపీలోకి మారినా కూడా జగన్ ని పెద్దగా టార్గెట్ చేసిన సందర్భాలు లేవు. ఆయనకు జిల్లాలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణతోనే విభేదాలు తారస్థాయిలో ఉండేవి. ఇపుడు కూడా జిల్లా రాజకీయాల్లో బొత్సదే హవాగా ఉన్నా జగన్ ఏం చెబితే చేయడానికి ఎవరైనా రెడీగా ఉండాల్సిందే. అందువల్ల సుజయ కృష్ణ రంగారావు ని వైసీపీలోకి తీసుకోవాలని జగన్ కనుక అనుకుంటే నో చెప్పేవారు ఎవరూ ఉండరని అంటున్నారు. మరోవైపు ఆయన కోసం బీజేపీ కూడా తలుపులు బార్లా తెరచేసింది. బొబ్బిలి రాజులు ఏ వైపునకు మొగ్గు చూపుతారో మరి చూడాలి