ఈయన సేఫ్ జోన్ లో .. కారణం అదేనట
చూడబోతే వారూ వీరూ అని చూడకుండా అందరికీ జైలు దారిని వైసీపీ సర్కార్ చూపిస్తోంది. చంద్రబాబు హయాంలో అంతా తామేనని రెచ్చిపోయిన ఉద్దండులు, మహా మహలకు ఇపుడు [more]
చూడబోతే వారూ వీరూ అని చూడకుండా అందరికీ జైలు దారిని వైసీపీ సర్కార్ చూపిస్తోంది. చంద్రబాబు హయాంలో అంతా తామేనని రెచ్చిపోయిన ఉద్దండులు, మహా మహలకు ఇపుడు [more]
చూడబోతే వారూ వీరూ అని చూడకుండా అందరికీ జైలు దారిని వైసీపీ సర్కార్ చూపిస్తోంది. చంద్రబాబు హయాంలో అంతా తామేనని రెచ్చిపోయిన ఉద్దండులు, మహా మహలకు ఇపుడు చుక్కలు చూపిస్తోంది. ఈ క్రమంలో ఉత్తరాంధ్రాలో మంత్రులుగా చేసిన పలువురు టీడీపీ నేతలకు అరెస్టుల టెన్షన్ పట్టుకుంది. వారు తమ శాఖల్లో గతంలో చేసిన కార్యక్రమాలు, అందులో చోటు చేసుకున్న అవినీతిని భూతద్దంలో చూసి మరీ కేసులు పెడుతోంది. ఈ నేపధ్యంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి మీద అనేక కేసులు పడ్డాయి. గంటా శ్రీనివాస్ సైకిల్ కుంభకోణంలో ఇరుక్కుంటారని అంటున్నారు. అందరికంటే ముందు అచ్చెన్నాయుడు ఏసీబీకి చిక్కారు.
ఆయనకలా…..
ఇక విజయనగరం జిల్లాకు చెందిన పెద్దాయన పూసపాటి రాజవంశీకుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మాన్సాస్ చైర్ పర్సన్ పదవి పోయింది. ఆయన అయిదేళ్ళు మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలు చూశారు. అందులో జరిగిన అవకతవకలు ఏమైనా ఉంటే చర్యలు తీసుకోవాలని కొత్త చైర్ పర్సన్, వైసీపీ నియమించిన సంచయిత గజపతిరాజు పట్టుదలగా పనిచేస్తున్నారు. అంతే కాదు, సింహాచలం దేవస్థానం విషయంలో గత పాలకవర్గం చేసిన నిర్ణయాలను ఆమె తిరగతోడుతున్నారు. దాంతో అశోక్ కి కూడా ఇబ్బందులు తప్పడంలేదు.
సైలెంట్ మోడ్ లో …
ఈ మొత్తం ఎపిసోడ్ లో మరో మాజీ మంత్రి టీడీపీ నేత పూర్తిగా సైలెంత్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. ఆయనెవరోకాదు, బొబ్బిలి రాజు సుజయ కృష్ణ రంగారావు, గట్టిగా యాభై ఏళ్ళులేని రాజావారు ముందే తొందరపడి టీడీపీలో చేరారు, ఆయన మంత్రి పదవి ఏం అనుభవించారో కానీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా బొబ్బిలి లో సాధించిన విజయం హుష్ కాకీ అయ్యేలా 2019లో ఓటమి పాలు అయ్యారు. దాంతో ఆయన మాజీ మంత్రిగా పూలమ్మిన చోటనే ఇపుడు కట్టెలమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నికల తరువాత ఆయన టీడీపీ అధినాయకత్వానికి ఏ మాత్రం అందుబాటులో ఉండకుండా పోయారని అంటున్నారు.
అందుకేనా ?
ఇపుడు ఆయన బద్ద విరోధి బొత్స సత్యనారాయణ వైసీపీ సర్కార్ లో సీనియర్ మంత్రిగా ఉన్నారు. ఆయన చక్రం తిప్పుతున్నారు. తన రాజకీయ ఆధిపత్యానికి కూడా గండిపడేలా సీన్ ఉంది. దాంతో విశాఖలో నివాసం ఉంటున్నారు. కరోనా వేళ సైతం ఆయన అందుబాటులో లేరన్న విమర్శలు ఉన్నాయి. ఆయన టీడీపీకి దూరం పాటిస్తూనే వైసీపీకి చెడ్డ కాకుండా జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు. ఆయన మీద జగన్ కి కోపం ఎంత ఉందో తెలియదు కానీ బొత్స మీద నమ్మకం తగ్గితే మాత్రం మళ్లీ వైసీపీలో చేరి చక్రం తిప్పాలనుకుంటున్నారు. ఆ రోజు కోసం ఎదురుచూస్తూ ఆయన ప్రస్తుతానికి కిమ్మనకుండా ఉంటున్నారు. ఇపుడున్న స్థీతిలో ఇలా ఉంటేనే తనకూ రాజకీయానికీ సేఫ్ అని బొబ్బిలి రాజావారు అనుకుంటున్నారుట.