ఆ లీడర్ రాజకీయానికి ఎండ్ కార్డ్
వైసీపీలో కీలక నేతకు ఎండ్ కార్డ్ పడిందా? విజయవాడలో ఇప్పుడు ఇదే టాక్ నడుస్తోంది. బెజవాడకు చెందిన రాజకీయ నాయకుడు.. సిటీ కేబుల్ వ్యాపార వేత్త అయిన [more]
వైసీపీలో కీలక నేతకు ఎండ్ కార్డ్ పడిందా? విజయవాడలో ఇప్పుడు ఇదే టాక్ నడుస్తోంది. బెజవాడకు చెందిన రాజకీయ నాయకుడు.. సిటీ కేబుల్ వ్యాపార వేత్త అయిన [more]
వైసీపీలో కీలక నేతకు ఎండ్ కార్డ్ పడిందా? విజయవాడలో ఇప్పుడు ఇదే టాక్ నడుస్తోంది. బెజవాడకు చెందిన రాజకీయ నాయకుడు.. సిటీ కేబుల్ వ్యాపార వేత్త అయిన పూనూరు గౌతం రెడ్డి.. చుట్టూ వ్యాఖ్యలు నడుస్తున్నాయి. ఆయన కమ్యూనిస్టు నాయకుడిగా కార్పొరేటర్గా గుర్తింపు సాధించారు. అయితే, తర్వాత కాలంలో కమ్యూనిస్టు జెండాను పక్కన పెట్టి జగన్కు జైకొట్టారు. 2014లో విజయవాడ సెంట్రల్ నియోజకవ ర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే, తర్వాత కాలంలో ఆయన వంగవీటి రంగా మృతిపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అధినేత జగన్తో అక్షింతలు వేయించుకున్నారు.
పార్టీ పదవినే….
అయితే, జగన్కు పూనూరు గౌతం రెడ్డి చాలా దగ్గర బంధువు కావడంతో పార్టీ నుంచి బహిష్కరించాలన్న వంగవీటి రాధా డిమాం డ్ను పక్కన పెట్టారు. ఇక, ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు తిరిగి పార్టీలోకి వచ్చి ప్రచారం చేశారు. కానీ, గతంలో పూనూరు గౌతంరెడ్డికి, ప్రస్తుత సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు మధ్య వివాదం ఉండడంతో వీరిద్దరి మథ్య ఇప్పటికీ.. ఆ వివాదం తాలూకు ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవికి తన పేరు పరిశీలించాలనే గౌతం రెడ్డి విజ్ఞప్తిపై జగన్ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. అయితే, రాష్ట్ర వాణిజ్య వర్గాల వైసీపీ ప్రెసిడెంట్గా మాత్రం గౌతం రెడ్డి కొనసాగుతున్నారు.
నివేదికలు అందడంతో….
కానీ, తనకు నామినేడెట్ పదవి ని ఇప్పించాలని పూనూరు గౌతం రెడ్డి తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. కానీ, ఆయన ఎలాంటి పదవీ లేకుండానే పార్టీని అప్రతిష్ట పాలు చేశారని, ఇప్పుడు ఆయన నామినేటెడ్ పదవి ఇస్తే.. మరింతగా రెచ్చిపోవడం ఖాయమనే నివేదికలు జగన్ వద్దకు చేరాయి. దీంతో నామినేటెడ్ పదవి ఇచ్చే ఉద్దేశం తనకు ఇప్పట్లో ఎవరి పట్లా లేదని జగన్ స్పష్టం చేశారు. అంతేకాదు, దీనికి స్థానిక సంస్థల ఎన్ని కలకు కూడా జగన్ ముడి పెట్టారు. స్థానిక ఎన్నికల్లో పార్టీని ముందుకు నడిపించేవారికే తాను ప్రాధాన్యం ఇస్తానని కుండబద్దలు కొట్టారు. దీంతో ఇప్పుడు పూనూరు గౌతం రెడ్డి భవితవ్యం అగమ్యగోచరంగా ఉందనే చర్చ జోరుగా సాగుతోంది.