Sun Mar 15 2026 15:21:44 GMT+0530 (India Standard Time)
పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగింపు దశకు
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే పోలింగ్ జరుగుతుంది

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే పోలింగ్ జరుగుతుంది. గతంలో వివిధ కారణాల వల్ల వాయిదా పడిన 36 సర్పంచ్, 68 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి.
ఇప్పటికే కొన్ని ఏకగ్రీవం...
అయితే ఇప్పటికే వీటి 30 సర్పంచ్, 38 వార్డు మెంబర్ల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాసేపట్లో పోలింగ్ ముగియనుంది. ఇప్పటికే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుుతుంది. సాయంత్రానికి ఫలితాలు తెలుస్తాయి.
Next Story

