బీసీలు ఒక్కటైతే దెబ్బేనా ?
బీసీలు అనే పేరుకు అంటారు. కానీ అందులో ఎన్నో కులాలు, ఉప కులాలు ఉన్నాయి. నిజానికి జగన్ బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తరువాత ఇన్ని [more]
బీసీలు అనే పేరుకు అంటారు. కానీ అందులో ఎన్నో కులాలు, ఉప కులాలు ఉన్నాయి. నిజానికి జగన్ బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తరువాత ఇన్ని [more]
బీసీలు అనే పేరుకు అంటారు. కానీ అందులో ఎన్నో కులాలు, ఉప కులాలు ఉన్నాయి. నిజానికి జగన్ బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తరువాత ఇన్ని కులాలు ఉన్నాయా అని అందరికీ తెలిసింది. ఒక అధ్యయనం ప్రకారం బీసీల్లో 140 ఉప కులాలు ఉన్నాయని చెబుతారు. ఇంకా చాలా ఎక్కువే ఉన్నాయని బీసీ సంఘాలు అంటున్నాయి. తమకు ఎవరూ ఇప్పటివరకూ న్యాయమే చేయలేదని కూడా బీసీ నేతలు ఆక్రోసిస్తున్నారు. జగన్ ఇచ్చిన పదవులు చాలవని కూడా చెబుతున్నారు. నిజానికి వైసీపీ హయాంలో బీసీలకు పెద్ద పీట వేశారన్నది నిజం. దాన్ని పొరుగున తమిళనాడుకు చెందిన పీఎంకే నేత రామదాస్ కూడా మెచ్చుకున్నారు. ఈ మేరకు జగన్ కి లేఖ రాసి మరీ అభినందించారు.
వైసీపీ వైపుగా….?
నిజానికి బీసీలు ఏపీలో టీడీపీకే బలమైన ఓటు బ్యాంక్ గా ఉంటూ వచ్చారు. అందుకే ఎన్నోసార్లు ఆ పార్టీ ఓడినా కూడా 2019 నాటి దారుణమైన పరాభవం మాత్రం చూసి ఎరగదు. అయితే బీసీలు 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో కూడా చాలా స్పష్టంగా కనిపించింది. ఇక ఆ మీదట పోయిన చోటనే వెతుక్కోవాలని చంద్రబాబు ఆరాటపడితే, వచ్చిన మద్దతుని పదికాలాల పాటు పదిలపరచుకోవాలని జగన్ ఆకాంక్షిస్తున్నారు. ఒక విధంగా చూస్తే ఏపీ రాజకీయాలో బీసీల కోసం పరుగు పందెం సాగుతోంది.
రాజకీయ పార్టీగా ….
సరిగ్గా ఇదే సమయంలో బీసీలంతా కొత్త ఆలోచనలు చేస్తున్నారుట. వారికి ఒక రాజకీయ పార్టీ కావాలని భావిస్తున్నారుట. ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు బీసీలకు ఒక రాజకీయ వేదిక అవసరం అని గట్టిగా నొక్కి చెబుతున్నారుట. బీసీలకు ఏ రాజకీయ పార్టీ పదవులు ఇచ్చినా కూడా వారు పూర్తిగా న్యాయం చేయలేరని ఆయన అంటున్నారుట. మనకు మనకే ఒక బలమైన రాజకీయ శక్తిగా మారితేనే బీసీలకు న్యాయం జరుగుతుంది అని ఆయన అంటున్నారుట. బీసీలకు రాజ్యాధికారం కావాలని, అదే అన్ని సమస్యలకు సరైన పరిష్కారమని కూడా ఆయన చెబుతున్నారుట. తాజాగా దీని మీద బీసీ నాయకులంతా సమావేశమై సీరియస్ గానే ఆలోచిస్తున్నారుట.
ఇద్దరికీ షాకేనా …?
రాష్ట్ర జనాభాలో బీసీలు యాభై శాతానికి పైగా ఉన్నారు. ప్రతీ నియోజకవర్గంలో వారి ప్రభావం చాలా అధికం. బీసీల మద్దతు లేకుండా ఏ ఒక్క పార్టీ కూడా ఇంతవరకూ అధికారంలోకి రాలేదు. బీసీలంతా ఒక్కటిగా నిలిచి రాజకీయ శక్తిగా ఎదిగితే వైసీపీ, టీడీపీలలో ఎవరికి దెబ్బ అని చర్చ అయితే తాజాగా ముందుకు వస్తోంది. బీసీలు టీడీపీకే మొదటి నుంచి మద్దతుగా ఉన్నారు. వారు కనుక పార్టీ పెడితే టీడీపీకే ఎక్కువ నష్టమని అంచనాలు ఉన్నాయి. వైసీపీకి తన అనుకూల బీసీల మద్దతు ఎటూ ఉంటుంది. టీడీపీ ఓట్ల నుంచే కోత పడుతుంది. పైగా ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఇతర వర్గాల మద్దతు ఎటూ వైసీపీకి కలసివచ్చే పరిణామం. కాపులు ఓ వైపు చేజారి టీడీపీకి షాక్ ఇచ్చారు. ఇపుడు బీసీలు కూడా పార్టీ పెడితే వారు గెలవకపోయినా టీడీపీ ఓటమికి బలమైన కారణం అవుతారు అంటున్నారు. మరి కధ అంతవరకూ వస్తుందా, బీసీలు పార్టీ పెడతారా అన్నది చూడాలి.
- Tags
- bc
- à°¬à±à°¸à±