నిమ్మగడ్డ అలా గడగడలాడిస్తారా?
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ మరింత పెరిగింది. సుప్రీంకోర్టు తీర్పుతో నిమ్మగడ్డ మరింత బలోపేతమయ్యారు. అధికార పార్టీ తనపై [more]
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ మరింత పెరిగింది. సుప్రీంకోర్టు తీర్పుతో నిమ్మగడ్డ మరింత బలోపేతమయ్యారు. అధికార పార్టీ తనపై [more]
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ మరింత పెరిగింది. సుప్రీంకోర్టు తీర్పుతో నిమ్మగడ్డ మరింత బలోపేతమయ్యారు. అధికార పార్టీ తనపై కుల పరంగ దాడి చేయడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు సమాచారం. అందుకోసమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల మొత్తాన్ని రీషెడ్యూల్ చేసే అవకాశముందని వైసీపీ కూడా అనుమానిస్తుంది. ఇప్పటికే అనేక చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి.
ఆయనపై వ్యక్తిగతంగా….
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్షంగా ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నారు. అందులో ఎవరూ కాదనలేరు. అదే సమయంలో వైసీపీ నేతలు ఆయనపై చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో ఆయనపై జరుగుతున్న ప్రచారం మాత్రం ఆయనకు ఇబ్బంది కల్గించేదే. ఇదే సమయంలో ఆయన పేరిట విడుదలయిన లేఖ కూడా సంచలనం కల్గిస్తుంది. కేంద్ర బలగాలతో ఎన్నికలు జరపాలని రమేష్ కుమార్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
మొత్తాన్ని రీషెడ్యూల్….
అదే సమయంలో ఎన్నికలను తిరిగి మొత్తం రీషెడ్యూల్ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు టాక్ విన్పిస్తుంది. అయితే ఎన్నికల కమిషన్ లోని కొందరు అధికారులు మాత్రం దీనికి అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది. చట్టపరంగా సమస్యలు వస్తాయని, ఆరోపణలు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో రీషెడ్యూల్ వేస్తే మంచిదని కొందరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సూచించినట్లు చెబుతున్నారు. ప్రధానంగా చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో కొన్ని చోట్ల జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి తిరిగి షెడ్యూల్ చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కొన్ని చోట్ల మాత్రం….
గుంటూరు జిల్లా మాచర్ల విషయంలో కూడా ఎన్నికల కమిషన్ తీవ్రంగా తీసుకుంది. అలాగే జగన్ సొంత జిల్లా కడప విషయంలో కూడా ఎన్నికల కమిషన్ రీ షెడ్యూల్ చేసే అవకాశముందం టున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు వ్యక్తిగతంగా అవమానం జరిగిందని భావిస్తున్నారు. తన కుటుంబ సభ్యులను కూడా ఈ వివాదంలో లాగడంతో ఆయన సీరియస్ గా ఉన్నారని చెబుతున్నారు. మొత్తం మీద సుప్రీంకోర్టు తీర్పు మేరకు ప్రభుత్వంతో సంప్రదించినా కొన్ని చోట్ల ఎన్నికలను రీ షెడ్యూల్ చేసే అవకాశముందంటున్నారు. ఇప్పటికే బీజేపీ, టీడీపీ, సీపీఐలు మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి ఫ్రెష్ గా జరపాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.